మావోయిస్టు పార్టీ మరో అగ్రనేత ఎన్ కౌంటర్
అమరావతి: మావోయిస్టు పార్టీకి కొలుకోలేని మరో ఎదురుదెబ్బ తగిలింది..ఛత్తీస్గఢ్లోని బీజాపూర్ అడవుల్లో జరిగిన ఎన్కౌంటర్లో మావోయిస్టు అగ్రనేత,,కేంద్ర కమిటీ సభ్యుడు సింహాచలం అలియాస్ సుధాకర్(65) మరణించాడు.. సుధాకర్ పూర్తిపేరు తెంటు లక్ష్మీనరసింహాచలం..40 ఏళ్లుగా మావోయిస్టు ఉద్యమంలో సింహాచలం ఉన్నారు..బీజాపూర్ జాతీయపార్కు ఈ ఎన్కౌంటర్ చోటు చేసుకుంది..పోలీసులకు అందిన సమాచారంతో బీజాపూర్ అడవులను జల్లెడపడుతున్నాయి..భద్రత బలగాల సెర్చ్ ఆపరేషన్ సమయలో మావోయిస్టులు ఎదురు పడడంతో ఇరువర్గాలు కాల్పులకు దిగాయి..ఘటనాస్థలంలో ఆటోమేటిక్ ఆయుధాలు, పేలుడు పదార్థాలు స్వాధీనం చేసుకున్నారు..సుధాకర్ స్వస్థలం ఏలూరు జిల్లా చింతలపూడి మండలం ప్రగడవరం. సుధాకర్పై రూ.50 లక్షల రివార్డు ఉంది.