OTHERSWORLD

దీపావళి సందర్బంగా హిందువులకు శుభాకాంక్షలు తెలిపిన డొనాల్డ్‌ ట్రంప్‌

అమరావతి: బంగ్లాలో హిందువులు, క్రైస్తవులతో పాటు ఇతర మైనారిటీలపై జరిగిన అనాగరిక దాడిని తీవ్రంగా ఖండిస్తున్నాని అమెరికా మాజీ అధ్యక్షుడు,, రిపబ్లికన్‌ పార్టీ అధ్యక్ష అభ్యర్థి డొనాల్డ్‌ ట్రంప్‌ తీవ్రంగా ఖండించారు.. దీపావళి పండుగ నేపథ్యంలో సోషల్‌మీడియా వేదికగా పోస్టు చేసిన ఆయన హిందువులకు శుభాకాంక్షలు తెలిపారు.. తాను అధ్యక్ష ఎన్నికల్లో గెలిస్తే భారత్‌తో, ప్రధాని మోదీతో అమెరికా సంబంధాలను మరింత బలోపేతం చేస్తానని పేర్కొన్నారు.. అమెరికా అధ్యక్షుడు బైడెన్‌, డెమోక్రటిక్‌ పార్టీ అధ్యక్ష అభ్యర్థి కమలా హారిస్‌ అమెరికాతోపాటు, ప్రపంచంలోని హిందువులను పట్టించుకోలేదని విమర్శించారు..

బంగ్లాలో హిందువులు, ఇతర మైనారిటీలపై జరిగిన అనాగరిక దాడులు,,అల్లరి మూకలు హిందువుల ఇండ్లు, దుకాణాలను దోపిడీ చేశారని తెలిపారు..దీంతో ఆ దేశంలో తీవ్రమైన భయానక గందరగోళ పరిస్థితులు తలెత్తాయన్నారు..అమెరికాలో రాడికల్‌ లెఫ్ట్‌ నుంచి ఎదురవుతున్న మత వ్యతిరేక ఎజెండా నుంచి హిందూ అమెరికన్లకు రక్షణ కల్పిస్తామని ట్రంప్‌ వెల్లడించారు..తన పరిపాలనతో ఇండియాతోపాటు తన స్నేహితుడు, ప్రధాని మోదీతో బలమైన భాగస్వామ్యాన్ని ఏర్పరుచుకుంటామని తెలిపారు..దీపావళి పండుగ చెడుపై విజయం సాధించేలా చేస్తుందని నమ్ముతున్నానని ట్రంప్‌ అన్నారు.

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *