ప్రపంచంలోనే అతిపెద్ద ఆధ్యాత్మిక వేడుక- ఘనంగా ప్రారంభమైన మహా కుంభ్
అమరావతి: ప్రపంచంలోనే అతిపెద్ద ఆధ్యాత్మిక వేడుకగా పేరొందిన మహా కుంభ్ ఘనంగా ప్రారంభమైంది.. గంగా,,యమునా,, సరస్వతీ నదులు కలిసే ప్రదేశమైన ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్రాజ్ భక్తులతో జనసంద్రమైంది..పుష్య పౌర్ణమి అయిన సోమవారం తెల్లవారుజాము నుంచే లక్షలాది మంది భక్తులు త్రివేణి సంగమంలో సనాతన ధర్మం అంచరించే భక్తులు,ఈ ధర్మంపై నమ్మకం వున్న విదేశీయులు సైతంపవిత్ర స్నానాలు ఆచరిస్తున్నారు.. సంక్రాతి నుంచి శివరాత్రి వరకు 45 రోజుల పాటు జరిగే ఈ కార్యక్రమానికి దేశ విదేశాల నుంచి కోట్ల మంది భక్తులు,,పర్యాటకులు చేరుకొనున్నారు.. సోమవారం ఉదయం 7.30 గంటల వరకు దాదాపు 35 లక్షల మందికిపైగా భక్తులు త్రివేణి సంగమంలో షాహీ స్నాన్ చేసినట్లు ప్రభుత్వ గణాంకాలు వెల్లడించాయి..దేశ నలుమూలల నుంచే కాకుండా విదేశీ పౌరులు కూడా పుణ్య స్నానాలు చేస్తున్నారు.