ప్రభుత్వ ఉద్యోగులు,పెన్షనర్లకు కేంద్రం ప్రభుత్వం శుభవార్త
అమరావతి: ప్రభుత్వ ఉద్యోగులు,, పెన్షనర్లకు కేంద్రం ప్రభుత్వం శుభవార్త చెప్పింది..ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలోని గురువారం సమావేశమైన కేంద్ర కేబినెట్,, 8వ వేతన సంఘం ఏర్పాటుకు ఆమోదం తెలిపింది..నరేంద్ర మోదీ నేతృత్వంలోని ప్రభుత్వం జనవరి 2016లో అమలులోకి తీసుకువచ్చిన 7వ వేతన సంఘం సిఫార్సులు ఈ సంవత్సరం డిసెంబర్ 31వ తేదితో ముగియనున్నది..8వ వేతన సంఘం వచ్చే ఏడాది జనవరి ఒకటి నుంచి అమలులోకి రానున్నాయి.. వేతన సంఘం సిఫారసుల మేరకు ఉద్యోగులకు వేతనాలు పెరగనున్నాయి.. వేతనం సంఘం ఏర్పాటుకు కేంద్రం ఆమోదం తెలిపిన నేపథ్యంలో త్వరలోనే కమిషన్ చైర్మన్తో పాటు ఇద్దరు సభ్యులను నియమించనున్నది.