దేవేంద్ర ఫడ్నవిస్ ప్రభుత్వంలో కొత్తగా 37 మంది కేబినెట్ మంత్రులుగా ప్రమాణస్వీకారం
అమరావతి: మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్ సారథ్యంలోని ”మహాయుతి” ప్రభుత్వంలో కొత్తగా 37 మంది కేబినెట్ మంత్రులుగా అదివారం ప్రమాణస్వీకారం చేశారు.. బీజేపీ నుంచి 19 మంది,, షిండే శివసేన నుంచి 11 మంది,,ఎన్సీపీ నుంచి 7 మందిని మంత్రివర్గంలోకి తీసుకున్నారు..నాగపూర్లోని రాజ్భవన్లో జరిగిన ప్రత్యేక కార్యక్రమంలో గవర్నర్ సీపీ రాధాకృష్ణ కొత్త ఎమ్మెల్యేలతో మంత్రులుగా ప్రమాణం చేయుంచారు..కేంద్ర మంత్రి నితిన్ గడ్కరి ఈ కార్యక్రమానికి హాజరయ్యరు..ముఖ్యమంత్రిగా దేవేంద్ర ఫడ్నవిస్, ఉపముఖ్యమంత్రులుగా అజిత్ పవార్, ఏక్నాథ్ షిండే ప్రమాణం చేశారు. అనంతరం తొలిసారి ఆదివారం మంత్రివర్గ విస్తరణ జరిగింది.