బ్రిటిష్ పాలకులను ఎదిరించి పోరాడిన విప్లవ వీరుడు అల్లూరి-జె.పీ కార్తీక్
అమరావతి: గిరిజనుల సంక్షేమమే ధ్యేయంగా బ్రిటిష్ పాలకులను ఎదిరించి పోరాడిన విప్లవ వీరుడు అల్లూరి సీతారామరాజు త్యాగ నిరతిని అందరూ గుర్తుంచుకుని,మన భాధ్యతల పట్ల కార్యోన్ముఖులు కావాల్సిన అవసరం ఉందని జిల్లా జాయింట్ కలెక్టర్ కె.కార్తీక్ తెలిపారు. బుధవారం కలెక్టరేట్లోని ఎస్ ఆర్ శంకరన్ హాల్లో అమరవీరుడు, స్వాతంత్ర సమరయోధుడు అల్లూరి సీతారామరాజు వర్ధంతిని జిల్లా యువజన సర్వీసుల శాఖ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. అల్లూరి సీతారామరాజు చిత్రపటానికి JC కార్తీక్,DRO ఉదయభాస్కర్, సెట్నెల్ CEO నాగేశ్వరరావు పూలమాలలతో ఘన నివాళి అర్పించారు. ఈ సందర్బంగా జెసి మాట్లాడుతూ అల్లూరి సీతారామరాజు లాంటి త్యాగధనుల ఫలితంగా వచ్చిన స్వాతంత్రాన్ని కాపాడుకునే దిశగా ప్రతి ఒక్కరూ అంకిత భావంతో పనిచేయాలన్నారు. ఈ కార్యక్రమంలో కలెక్టరేట్లోని వివిధ విభాగాల సిబ్బంది పాల్గొన్నారు.