మహనీయుడు రవీంద్రనాథ్ ఠాగూర్ స్మరించుకోవడం గర్వంగా వుంది-మంత్రి నారాయణ
అమరావతి: వేదాంత తత్త్వాన్ని, దేశభక్తిని, సాహితీ విలువలను ఒకే వ్యక్తిత్వంలో సమన్వయపర్చిన రవీంద్రనాథ్ ఠాగూర్ మహానుభావుడని మునిసిపాల్ శాఖ మంత్రి నారాయణ తెలిపారు..బుధవారం రవీంద్రనాథ్ ఠాగూర్ (మే, 7-1861) జయంతి సందర్భంగా ఆయన స్ఫూర్తిని స్మరించుకోవడం భారతీయుడిగా గర్వపడుతున్నాఅని పేర్కొన్నారు.. భారతదేశజాతీయ గీతాన్ని రచించిన మహోన్నత కవి అన్నారు.. ఆయన రచనలు, ఆలోచనలు, విద్యా సిద్ధాంతాలు ఈనాటికీ మనకు మార్గదర్శకంగా నిలుస్తున్నాయని తెలిపారు..