రాష్ట్రంలో కొత్త రేషన్ కార్డులు బుధవారం నుంచి జారీ చేస్తాం-పౌరసరఫరాల శాఖ మంత్రి
అమరావతి: రాష్ట్రంలో కొత్త రేషన్ కార్డులు బుధవారం నుంచి జారీ చేస్తామని పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ వెల్లడించారు..మంగళవారం అమరావతిలో మంత్రి మీడియా సమావేశంలో కొత్త కార్డులు జారీ,, రేషన్ కార్డులు స్ప్లిట్,, కొత్త సభ్యుల చేరికతోపాటు చిరునామా మార్పు చేసేందుకు అవకాశం కల్పిస్తున్నట్లు వెల్లడించారు.. రేషన్ కార్డులో మార్పు కోసం ఇప్పటి వరకు 3.28 లక్షల దరఖాస్తులు వచ్చాయని వివరించారు..అలాగే రేపటి నుంచి కొత్త రేషన్ కార్డులు జారీకి దరఖాస్తులు స్వీకరిస్తామని ఆయన తెలిపారు..క్యూ ఆర్ కోడ్తో స్మార్ట్ రేషన్ కార్డును జారీ చేస్తామని ఆయన స్పష్టత ఇచ్చారు..అలాగే కుటుంబ సభ్యులు పేర్లు కనిపించేలా స్మార్ట్ కార్డు జారీ చేస్తామన్నారు..క్యూ ఆర్ కోడ్ స్కాన్ చేస్తే గడిచిన 6 నెలలుగా రేషన్ తీసుకున్న వివరాలు సైతం కనిపించేలా వీటిని రూపొందిస్తున్నట్లు చెప్పారు.. దేశంలో ఎక్కడైనా రేషన్ తీసుకునేలా ఈ కార్డు వెసులుబాటు కల్పిస్తుందన్నారు..కొత్త రేషన్ కార్డులు దరఖాస్తు కోసం, ఒక నెల రోజులు గడువు ఇస్తున్నామన్నారు.. గ్రామ వార్డు సచివాలయాలకు వెళ్లి ప్రజలు తమ వివరాలను తెలుసుకోవచ్చునన్నారు.. 4.24 కోట్ల మందికి స్మార్ట్ కార్డు జారీ చేయనున్నట్లు చెప్పారు..ప్రస్తుతం 95 శాతం మేర ఈ కేవైసి పూర్తయిందని,,ఈ కేవైసి పూర్తయిన వాళ్ళు కొత్తగా దరఖాస్తు చేయాల్సిన అవసరం లేదన్నారు.