అపరేషన్ సింధూరు-హతం అయిన ఉగ్రవాదుల సంఖ్య 100?
అమరావతి: జమ్ము,కాశ్మీరులోని పహల్గాం బైసరన్లో 26 మంది పర్యాటకులను దారుణంగా చంపిన ఉగ్రవాదులకు భారత సైన్యం మెరుపు వేగంతో దాడులతో జవాబు ఇచ్చింది..బుధవారం వేకువజామున 1.44 గంటలకు పాకిస్తాన్,,పాక్ ఆక్రమిత కశ్మీర్లోని 9 ఉగ్రస్థావరాలపై భారత సైన్యం మెరుపుదాడులతో విరుచుకుపడింది..ఈ దాడుల్లో 80 మందికి పైగా ఉగ్రవాదులు హతమైనట్లు ఆర్మీ ఉన్నతాధికారుల వ్యాఖ్యనిస్తున్నారు..జైషే మహ్మద్,,లష్కరే తోయిబా,, హిజ్బుల్ ముజాహిద్దీన్ ఉగ్రవాద స్థావరాలను లక్ష్యంగా చేసుకుని మిస్సైళ్లతో ఇండియన్ AIR FORCE విరుచుకుపడింది.. బహవల్పూర్ జైషే మహ్మద్,, ముర్కిదేలోని లష్కరే తోయిబా ఉగ్రవాద స్థావరాలను ధ్వంసం చేసినట్లు తెలిపారు..ఈ క్యాంపుల్లో 25 నుంచి 30 మంది చొప్పున టెర్రరిస్టులు హతమై ఉంటారని వెల్లడించారు..ముర్కిదే ప్రాంతం టెర్రర్ నర్సరీగా చెప్పుకుంటారు..ఈ క్యాంపును 200 ఎకరాల్లో విస్తరించి,, ఉగ్రవాద శిక్షణా కార్యకలాపాలను కొనసాగిస్తున్నారు.. ఇది లష్కరే తోయిబా ఉగ్రవాద సంస్థకు ముర్కిదే వెన్న ఎముకలాంటిది..బుధవారం జరిగిన ఎయిర్ స్ట్రెక్స్ లో 80 నుంచి 90 మంది దాకా టెర్రరిస్టులు హాతం అయినట్లు తమకు సమాచారం ఉందని పేర్కొన్నారు..అయితే హతం అయిన ఉగ్రవాదుల ముఖ్యనాయకులు,,ఇతర ఉగ్రవాదులు సంఖ్య ఎంత అనేది ఇప్పటి వరకు స్పష్టంగా తెలియదు..మరింత సమాచారం అందాల్సి వున్నట్లు అధికారులు పేర్కొన్నారు.
“ఆపరేషన్ సింధూర్”తో భారత్ ధీటైన జవాబు-ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్
దశాబ్దాలుగా సహనం.. సహనం… మితిమీరిన సహనంతో చేతులు కట్టేసిన సమస్త భారతానికి “ఆపరేషన్ సింధూర్” తో తిరిగి భారత సమాజంలో వీరత్వాన్ని నింపిన త్రివిధ దళాధిపతులకు, వారికి వెన్నంటి నిలబడ్డ ప్రధానమంత్రి నరేంద్రమోదీకి,,ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కృతజ్ఞతలు తెలిపారు.. మీ వెన్నంటే మేము వుంటాం అని వెల్లడించారు.