AP&TG

పవన్ కళ్యాణ్ ఇలా కూడా స్పందిస్తారా-పింఛను సొమ్ము దాచుకొని అమ్మవారికి..

అమరావతి: పిఠాపురంలో పవన్ కళ్యాణ్ విజయం కాంక్షిస్తూ వేగులమ్మకు మొక్కుకున్న శ్రీమతి పేరంటాలమ్మ,, తన పింఛను సొమ్ము దాచుకొని అమ్మవారికి రూ.27 వేల విలువైన గరగ చేయించి ఇచ్చారు..గత సార్వత్రిక ఎన్నికల్లో రాష్ట్ర ఉప ముఖ్యమంత్రివర్యులు పవన్ కళ్యాణ్ విజయాన్ని కాంక్షిస్తూ వేగులమ్మ అమ్మవారికి మొక్కులు మొక్కి… తన పింఛను సొమ్ముతో మొక్కులు చెల్లించారు..ఈ విషయం తెలుసుకున్న పవన్ కళ్యాణ్, శ్రీమతి పేరంటాలమ్మని శుక్రవారం మంగళగిరిలోని క్యాంపు కార్యాలయానికి పిలిపించుకొని ఆమెతో ముచ్చటించారు..తనపై చూపిన మమకారానికి ముగ్దులయిన పవన్, శ్రీమతి పేరంటాలమ్మతో కలసి భోజనం చేశారు..ఆత్మీయంగా పలుకరిస్తూ స్వయంగా భోజనం వడ్డించి, చీరను బహూకరించారు. పింఛను సొమ్ముతో మొక్కులు చెల్లించిన విషయం తెలుసుకుని ఆర్థిక సాయం అందించారు.. శ్రీమతి పేరంటాలమ్మకు తిరుగు ప్రయాణానికి ఏర్పాటు చేసిన వాహనం వరకు స్వయంగా వచ్చి మరీ సాగనంపారు..(పిఠాపురం నియోజకవర్గం యు.కొత్తపల్లి మండలం కొత్త ఇసుకపల్లికి చెందిన వృద్ధురాలు శ్రీమతి పోతుల పేరంటాలు.)

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *