పాక్ మిలిటరీ స్థావరాలను మాత్రమే లక్ష్యంగా చేసుకుని ఇండియన్ ఆర్మీ దాడులు-విదేశాంగ కార్యదర్శి
పాకిస్తాన్ చర్యలు,భారతదేశంను రెచ్చగొట్టేవిగా, ఉద్రిక్తతలను పెంచేవిగా ఉన్నాయని, పాకిస్థాన్ చర్యల వల్లే సరిహద్దు వద్ద ఉద్రిక్తతలు నెలకొన్నాయని విదేశాంగ కార్యదర్శి మిశ్రి తెలిపారు..శనివారం ఆపరేషన్ సిందూర్ గురించి రక్షణ శాఖ నిర్వహించిన మీడియా సమావేశంలో మిశ్రి మాట్లాడుతూ పాకిస్థాన్ చర్యలకు తగిన రీతిలో భారత్ స్పందిస్తున్నట్లు చెప్పారు.. రాజౌరీపై జరిగిన కాల్పుల్లో ఓ అధికారి మృతిచెందినట్లు విక్రమ్ మిశ్రీ తెలిపారు.పాకిస్థాన్కు బలమైన సమాధానం ఇస్తున్నట్లు కల్నల్ సోఫియా ఖురేషి తెలిపారు.. శ్రీనగర్, అవంతిపుర, ఉదంపూర్లో ఉన్న వైద్య కేంద్రాలపై పాకిస్థాన్ దాడి చేసినట్లు ఆమె తెలిపారు.. పంజాబ్పై హైస్పీడ్ మిస్సైల్ను పాకిస్థాన్ ప్రయోగించినట్లు కల్నల్ సోఫియా వెల్లడించారు..పాకిస్తాన్ తమ సైనిక బలగాలను బోర్డర్ దిశగా తరలిస్తోందని ఆమె పేర్కొన్నారు.. పశ్చిమ బోర్డర్లో ఉన్న భారతీయ సైనిక కేంద్రాలపై డ్రోన్లు, లాంగ్ రేంజ్ వెపన్స్, అమ్యునిషన్స్, జెట్స్ను పాక్ వినియోగిస్తోందని వెల్లడించారు..వేకువజామున 1.40 నిమిషాల సమయంలో పంజాబ్ ఎయిర్ బేస్పై పాక్ దాడి చేసిందని,,ఆ దాడి కోసం హై స్పీడ్ మిస్సైళ్లను పాక్ వాడినట్లు పేర్కొన్నారు..వైమానిక స్థావరాలు,, కీలక స్థావరాలు డ్యామేజ్ అయినట్లు పాక్ చేస్తున్నట్లు ఆరోపణలు నిజం కాదు అని ఆమె వెల్లడించారు.. ఆర్మీ బేస్ల ధ్వంసానికి చెందిన టైం స్టాంప్ పిక్స్ ను ఇండియన్ మిలిటరీ షేర్ చేస్తున్నట్లు ఆమె తెలిపారు.. పాకిస్థాన్ కవ్వింపులకు బదులుగా ఆ దేశానికి సంబందించిన మిలిటరీ స్థావరాలను మాత్రమే లక్ష్యంగా చేసుకుని ఇండియన్ ఆర్మీ అటాక్ చేసినట్లు వింగ్ కమాండర్ వ్యోమికా సింగ్ తెలిపారు.. పాకిస్థాన్ తప్పుడు ప్రచారం చేస్తున్నట్లు ఆమె చెప్పారు..ఎస్-400 ధ్వంసమైనట్లు వస్తున్న వార్తలు నిజంకాదన్నారు..ఇదే సమయంలో పాకిస్థాన్ లోని రహిమ్ యార్ ఖాన్లో ఉన్న సైనిక ఆస్తులను టార్గెట్ చేసినట్లు వింగ్ కమాండర్ వ్యోమికా సింగ్ తెలిపారు.. భారతీయ సైనిక బలగాలు నిత్యం సంసిద్ధతతో ఉన్నాయని, అన్ని దాడులకు ధీటైన జవాబు ఇస్తున్నామని వ్యోమిక చెప్పారు.. ఉద్రిక్తతలను తగ్గించేందుకు భారతీయ సైనిక బలగాలు కట్టుబడి ఉన్నాయన్నారు..