విజయనగరం జిల్లా పోలీస్ స్టేషన్ లో శ్రీరెడ్డి విచారించిన పోలీసులు
అమరావతి: నటి శ్రీరెడ్డిని విజయనగరం జిల్లా పూసపాటిరేగ పోలీసులు విచారిస్తున్నారు. ఎన్నికలకు ముందు ప్రస్తుత సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, మంత్రి నారా లోకేశ్ లపై ఆసభ్య పదజాలం వుపయోగించి దారుణమైన వీడియోలను సోషల్ మీడియాలో శ్రీరెడ్డి పోస్ట్ చేసిన విషయం విదితమే..శనివారం పూసపాటిరేగ పోలీస్ స్టేషన్ లో విచారణకు హాజరయింది.. విచారణకు హాజరు కావాలంటూ పోలీసులు నోటీసులు ఇచ్చిన నేపథ్యంలో ఆమె పోలీస్ స్టేషన్ కు వచ్చింది. జగన్ సీఎంగా ఉన్న సమయంలో శ్రీరెడ్డి అడ్డూఅదుపు లేకుండా చెలరేగిపోయింది.. మహిళ అనే విచక్షణ కూడా లేకుండా సోషల్ మీడియా వేదికగా బండ బూతులు మాట్లాడింది. అయితే ఎన్నికల్లో కూటమి గెలిచిన వెంటనే ఆమె స్వరం మార్చి,, తనను క్షమించాలని, ఇకపై రాజకీయాల గురించి మాట్లాడనని ఆమె వేడుకుంది..’నారా లోకేశ్ అన్నయ్యా క్షమించండి’ అంటూ బహిరంగంగా క్షమాపణలు కూడా చెప్పింది.. అయితే ఆమెపై తీవ్ర ఆగ్రహంతో ఉన్న కూటమి కార్యకర్తలు పోలీసులకు ఫిర్యాదు చేసి వుండడంతో,, ఆమెపై కేసు నమోదు చేశారు. మరోసారి కూడా విచారణకు పిలిస్తే రావాలని ఈ సందర్భంగా శ్రీ రెడ్డికి సమాచారం పోలీసులు ఇచ్చారు.