గిరిజన గ్రామస్తుల కోరిక మేరకు కురుడి శివాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన పవన్ కళ్యాణ్
అమరావతి: అరకు నియోజకవర్గం పరిధిలోని కురిడి గ్రామ అభివృద్ధికి తన సొంత నిధుల నుంచి రూ.5 లక్షలు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ప్రకటించారు..పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ, పర్యాటకశాఖ సంయుక్త కార్యాచరణలో గ్రామంలో ప్రకృతి వ్యవసాయం,,టూరిజంకి ప్రోత్సాహకాలు కల్పించడం ద్వారా ఉపాధి కల్పిస్తామని హామీ ఇచ్చారు.. మంగళవారం అల్లూరి సీతారామరాజు జిల్లా పర్యటనలో భాగంగా అడవితల్లి బాట కార్యక్రమ ప్రారంభోత్సవం సమయంలో పవన్ కళ్యాణ్ కి కలిసిన కురుడి గ్రామ గిరిజనులు తమ ఊరి శివాలయంలో దర్శనం చేసుకుని వెళ్లాలని కోరగా, వస్తానని హామీ ఇచ్చారు..కురుడి గ్రామంలో కొలువైన శ్రీ భ్రమరాంబ సమేత మల్లికార్జున స్వామిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు..అనంతరం రచ్చబండ కార్యక్రమంలో పాల్గొన్నారు..