రూ.2 లక్షల 91 వేల కోట్లతో తెలంగాణ బడ్జెట్ను ప్రవేశ పెట్టిన మంత్రి భట్టి విక్రమార్క
హైదరాబాద్: తెలంగాణ 2024-25 వార్షిక బడ్జెట్ను ఉపముఖ్యమంత్రి, ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్క గురువారం అసెంబ్లీలో ప్రవేశపెట్టారు..రూ.2 లక్షల 91 వేల 159 కోట్లతో 2024-25 ఆర్థిక సంవత్సరానికి బడ్జెట్ను ప్రతిపాదించారు..ఇందులో రెవెన్యూ వ్యయం రూ.2,20,945 కోట్లు కాగా మూలధన వ్యయం రూ.33,487 కోట్లుగా ప్రతిపాదించారు..మెట్రో వాటర్ వర్క్స్ కు రూ.3,385 కోట్లు,, నూతనంగా ఏర్పాటు చేసిన హైడ్రాకు రూ.200 కోట్లు,, GHMCలో మౌలిక వసతులు కల్పనకు రూ.3,065 కోట్లు, HMDAలో మౌలిక వసతుల కల్పనకు రూ.500 కోట్లు,, వ్యవసాయానికి రూ.72,659 కోట్లు,, ఉద్యానవనం రూ.737 కోట్లు,, పశుసంవర్ధక శాఖకు రూ.1,980 కోట్లు కేటాయించారు..రూ.500 గ్యాస్ సిలిండర్ పథకం కోసం రూ.723 కోట్లు, గృహజ్యోతి పథకానికి రూ.2,418 కోట్లు ప్రతిపాదించారు.