కర్రల గుట్ట వద్ద ఎదురు కాల్పులు-20 మంది మావోయిస్టులు మృతి?
హైదరాబాద్: తెలంగాణ-ఛత్తీస్గఢ్ సరిహద్దుల్లో మావోయిస్టులు, భద్రతా దళాలకు మధ్య భీకర కాల్పులు జరిగినట్లు బస్తర్ ఐజీ సుందర్ రాజ్ ధృవీకరించారు..ఛత్తీస్గఢ్ రాష్ట్రం బీజాపూర్ జిల్లా కర్రగుట్టల్లో గత రెండు వారాల పైగా భద్రతా దళాలు, మావోయిస్టుల వేటలో నిమగ్నమైన వున్నారు..ఈ క్రమంలోనే ఇప్పటివరకు నాలుగురు మావోయిస్టు అగ్రనేతలు వున్నట్లు సమాచారం..బుధవారం ఉదయం బీజాపూర్ జిల్లాలోని కర్రెగుట్ట ప్రాంతాల్లో సెర్చింగ్ ఆపరేషన్ నిర్వహిస్తున్న భద్రతా దళాలకు మావోయిస్టులు తారాసపడడంతో,,ఇరు వర్గాల మధ్య ఎదురు కాల్పులు చోటు చేసుకుంటున్నట్లు తెలుస్తొంది.. ఈ ఎదురు కాల్పుల్లో ఇప్పటి వరకు 20 మంది మావోయిస్టులు మరణించారని తెలుస్తొంది..మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది..ఘటనాస్థలం నుంచి భారీగా ఆయుధాలు, పేలుడు పదార్థాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం.. అంతిమ లక్ష్యంగా జరుగుతున్న ఆపరేషన్ “కగార్” స్వల్ప విరామం తరువాత ఆపరేషన్ కొనసాగుతొంది..డ్రోన్ కెమెరాల సహాయంతో మావోయిస్టుల కదలికలను భద్రత దళాలు గుర్తిస్తున్నట్లు సమాచారం.