AP&TGNATIONAL

చివరి ఉగ్రవాదిని ఏరివేసే వరకు ‘ఆపరేషన్ సిందూర్’ కొనసాగాలి-పవన్ కళ్యాణ్

హైదరాబాద్: చివరి ఉగ్రవాదిని ఏరివేసే వరకు ‘ఆపరేషన్ సిందూర్’ కొనసాగాలని,,పాకిస్థాన్ లోని ఉగ్ర స్థావరాలపై దాడులు చేసి భారత్ దీటైన జవాబు చెప్పిందని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పాకిస్థాన్‌లోని ఉగ్ర స్థావరాలపై భారత్‌ చేసిన దాడులపై పై విధంగా డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌ స్పందించారు..బుధవారం హైదరాబాద్ లో మీడియాతో మాట్లాడుతూ ఉగ్రవాదంపై పోరాటంలో ప్రధానమంత్రి నరేంద్రమోదీకి యావత్ జాతి మద్దతిస్తుందన్నారు..ఆపరేషన్‌ సింధూర్‌ విజయవంతంగా చేయడం భారతదేశంలో ప్రతి ఒక్కరూ గర్వించదగ్గ విషయమని కొనియాడారు.. పహల్గాం దాడి సమయంలో హిందువులా? కాదా? అని అడిగి మరీ ఉగ్రవాదులు చంపారని పవన్‌ కల్యాణ్‌ తెలిపారు..దేశం మొత్తం పుట్టెడు దుఃఖంలో ఉందని.. ఆ ఘటనకు ప్రతీకారం తీర్చుకోవాలని యావత్‌ దేశం ఎదురుచూసిందని పేర్కొన్నారు..పాకిస్థాన్‌కు మద్దతుగా ఆలోచించే నాయకులు తమ వైఖరి మార్చుకోవాలని సూచించారు..కుక్కలు అరిచినట్లు సోషల్‌మీడియాలో ఎవరూ అరవద్దని,, దేశానికి వ్యతిరేకంగా సోషల్‌మీడియాలో పోస్టులు పెట్టవద్దన్నారు.. ముఖ్యంగా సెలబ్రెటీలు, ఇన్‌ఫ్ల్యూయెన్సర్లు సోషల్‌మీడియాలో ఏది పడితే అది పెట్టవద్దని హితవు పలికారు.. ఎవరైనా దేశానికి వ్యతిరేకంగా పోస్టులు పెడితే చర్చలు తప్పవని హెచ్చరించారు..కాంగ్రెస్ లో కొందరు నాయకులు తమ వైఖరిని మార్చుకుంటే మంచిదని హితవు పలికారు.. కాశ్మీర్ అనేది దేశంలో భాగం…1990 లో కాశ్మీర్ పండిట్ లను చంపారు…అంత్యక్రియలను చేయడానికి వచ్చిన వారిని చంపారు…సరైన సమయంలో ఆర్మీ సరైన నిర్ణయం తీసుకుంది…లుంబినీ పార్కు,గోకుల్ చాట్ లాంటి ఘటనలు చూసాము…మిలిటరీ యుద్ధం చేస్తుంటే మనం ఏమి చేయాలో అది తెలియాలి, దాని కోసమే మాక్ డ్రిల్ కార్యక్రమం..దేశ ద్రోహులకు సోషల్ మీడియా లో సరైన సమాధానం చెప్పాలి…పోలీస్ అధికారులకు పిర్యాదులు చేయాలన్నారు..

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *