NATIONAL

ఎయిర్ టూ సర్ఫేస్ టార్గెట్స్9-ఉగ్రస్థావరాలపై 24 మిస్సైళ్లతో 25 నిమిషాల్లో పూర్తి

అమరావతి: జమ్ము,కాశ్మీరులోని ప‌హ‌ల్గాం ఉగ్రదాడుల తరువాత 14 రోజులకి పాకిస్తాన్ అలాగే పాక్‌ ఆక్రమిత కశ్మీర్‌లోని ఉగ్రస్థావ‌రాలే లక్ష్యంగా చేసుకుని భారతదేశం విరుచుకుపడింది..‘ఆపరేషన్‌ సిందూర్‌’ పేరుతో 9 ఉగ్రవాద కేంద్రాల‌పై మెరుపుదాడి చేసింది..కేవలం 25 నిమిషాల్లోనే ఆ ఉగ్రస్థావరాలపై 24 మిస్సైళ్లతో ఉగ్రవాద శిబిరాలను శిథిలం చేసింది..ఈ మెరుపు దాడితో పాకిస్తాన్ ఉక్కిరిబిక్కిరి అయిపోయింది..

ఎయిర్ టూ సర్ఫేస్ టార్గెట్స్:-9……..

బ‌హ‌వ‌ల్‌పుర్‌:- జైషే ఈ మొహ‌మ్మద్ ప్రధాన కార్యాల‌యం

పాకిస్థాన్‌లోని పంజాబ్‌లో బ‌హ‌వ‌ల్‌పుర్ ఆప‌రేష‌న్‌ సింధూర్ లో ప్రధాన టార్గెట్.. జైషే ఈ మొహ‌మ్మద్ ఉగ్ర సంస్థ‌ ప్ర‌ధాన కార్యాల‌యంకు మ‌సూద్ అజార్ నేతృత్వం వ‌హిస్తున్నారు..భారతదేశంలో జరిగిన అనేక ఉగ్ర దాడుల‌కు ఈ సంస్థ‌కు సంబంధాలు వున్నాయి..

ముర్దికే:-ల‌ష్క‌రే తోయిబా బేస్ క్యాంపు-శిక్ష‌ణ కేంద్రం

లాహోర్‌కు ఉత్త‌రం వైపున 40 కిలోమీట‌ర్ల దూరంలో ముర్దికే ఉన్నది.. ల‌ష్క‌రే తోయిబా ఉగ్రసంస్థకు ఇదో ముఖ్య కేంద్రం..ఇక్క‌డే ల‌ష్క‌రే కు చెందిన జ‌మాత్ ఉద్ ద‌వా వింగ్ ఉంది..సుమారు 200 ఎక‌రాల విస్తీర్ణంలో ఉంటుంది.. ముర్దికే కేంద్రంలో శిక్ష‌ణ ప్రాంతాలు,,లాజిస్టిక్ స‌పోర్టు కేంద్రాలు,,ఉగ్రవాదంను నూరిపోసే కేంద్రాలు ఉన్నాయి..2008-26-11 ముంబై దాడుల‌కు చెందిన ఉగ్రవాదుల శిక్ష‌ణ ఇక్క‌డే జ‌రిగిన‌ట్లు భావిస్తున్నారు..

కోట్లీ:- బాంబ‌ర్ ట్రైనింగ్‌,, టెర్ర‌ర్ లాంచ్ బేస్‌

పాక్ ఆక్ర‌మిత క‌శ్మీర్‌లో కోట్లీ కేంద్రం ఉన్న‌ది..సూసైడ్ బాంబ‌ర్లు,,చొర‌బాటుదారుల‌కు ఇక్క‌డే శిక్ష‌ణ ఇస్తారు..ఇక్క‌డ ఒకేసారి 50 మంది ఉగ్ర‌వాదుల‌కు శిక్ష‌ణ ఇచ్చే సామ‌ర్థ్యం ఉన్న వ‌స‌తులు ఉన్నాయి..

గుల్‌పూర్‌:- రాజౌరీ, పూంచ్ జిల్లాల్లో జ‌రిగే దాడుల‌కు ఈ కేంద్రం లాంచ్‌ప్యాడ్‌లా ప‌నిచేస్తుంది..జ‌మ్మూక‌శ్మీర్‌లోని ఆ రెండు జిల్లాల్లో జ‌రిగే దాడుల‌కు గుల్‌పూర్‌ను ఉగ్ర‌వాదులు కేంద్రంగా మార్చుకున్న‌ట్లు గుర్తించారు..2023- 2024 సంవ‌త్స‌రాల్లో ఇక్క‌డ నుంచే ఎక్కువ దాడులు జ‌రిగాయి..భార‌తీయ భ‌ద్ర‌తాదళాల కాన్వాయ్‌లు,, పౌర కేంద్రాల‌ను ఇక్క‌డ నుంచి ఉగ్ర‌వాదులు టార్గెట్ చేసిన‌ట్లు భావిస్తున్నారు..

స‌వాయి:- క‌శ్మీర్ లోయ‌ల్లో జ‌రిగే దాడుల‌కు ఇక్క‌డ ఉన్న ల‌ష్కరే క్యాంపుకు లింకు ఉంది..ఉత్త‌ర క‌శ్మీర్‌లో జ‌రిగే దాడుల‌కు స‌వాయి క్యాంపుతో లింకు ఉన్న‌ట్లు గుర్తించారు.. సోన్‌మార్గ్‌,,గుల్మార్గ్,, పెహ‌ల్గామ్‌లో జ‌రిగే దాడుల్లో స‌వాయి ఉగ్ర క్యాంపుతో లింకు ఉంది..

స‌ర్జ‌ల్‌బ‌ర్నాలా:- చొర‌బాటుదారుల‌కు ఇవి కేంద్రాలుగా వుంటాయి..అంత‌ర్జాతీయ స‌రిహ‌ద్దు,, నియంత్ర‌ణ రేఖ‌కు ద‌గ్గ‌ర‌గా ఉండడంతొ స‌ర్జ‌ల్‌, బ‌ర్నాలాలు చొర‌బాటుదారుల‌కు ముఖ్య కేంద్రాలుగా భావిస్తున్నారు..

మెహ‌మూనా:-హిజ్బుల్ ముజాహిద్దిన్ ఇక్క‌డ ఉన్న‌ట్లు అంచ‌నా వేస్తున్నారు.. సియాల్‌కోట్ కు స‌మీపంలో ఈ క్యాంపు ఉన్న‌ది.. ఉగ్ర సంస్థ హిజ్బుల్ ముజాహిద్దిన్ దీన్ని ఉపయోగిస్తుంది..ఆక్రమిత క‌శ్మీర్‌లో ఈ క్యాంపు యాక్టివ్‌గా ఉన్న‌ది..ఈ గ్రూపు ప్ర‌స్తుతం త‌న కార్య‌క‌లాపాల‌ను త‌గ్గించినా,,టూరిస్టులపై జరిగిన దాడుల్లో దాని ఆన‌వాళ్లు ఉన్నాయ‌న్న అనుమానాలు వ్య‌క్తం అవుతున్నాయి.

బిలాల్ క్యాంపు:- జేషే మొహ‌మ్మ‌ద్‌కు చెందిన మ‌రో ఉగ్రవాదుల ల్యాంచ్‌ప్యాడ్..బుధవారం నిర్వహించిన దాడిలో ఇది ధ్వంసం అయింది..చొర‌బాటుకు పాల్ప‌డ‌డానికి ముందు ఉగ్ర‌వాదులు ఇక్క‌డే బ‌స చేస్తారు.. భార‌త్ భూభాగంలోకి చొర‌బాడేందుకు ఈ క్యాంపును తుది ట్రాన్సిట్ పాయింట్‌గా భావిస్తారు.

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *