అమరావతి పూర్తిగా సేఫ్ జోన్ లో ఉంది-మంత్రి పొంగూరు.నారాయణ
కృష్ణానది వల్ల రాజధానికి ఎలాంటి ఇబ్బంది లేదు..
అమరావతి: గత ప్రభుత్వం రాజకీయ దురుద్దేశంతో అమరావతి మునిగిపోతుందని విష ప్రచారం చేసిందని పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి పొంగూరు నారాయణ అన్నారు..అమరావతి పూర్తిగా సేఫ్ జోన్ లో ఉందని,ఎలాంటి ఇబ్బందీ లేదన్న మంత్రి…భవిష్యత్తులో కూడా ఎలాంటి దుష్ప్రచారం నమ్మొద్దని విజ్ఞప్తి చేశారుజ.విజయవాడలోని CRDA ప్రధాన కార్యాలయంలో మంత్రి నారాయణ మీడియాతో మాట్లాడారు.
ముంపు లేకుండా రిజర్వాయర్లు,కాల్వల నిర్మాణం:- అమరావతి రాజధానికి పనికిరాదని గత ప్రభుత్వం ప్రచారం చేయడంతో పాటు ప్రపంచబ్యాంకు కూడా నిధులు ఇవ్వొద్దని లేఖలు రాశారని, కృష్ణా నదికి రికార్డు స్థాయిలో 11.43 లక్షల క్యూసెక్కుల వరద వచ్చినప్పటికీ ఎలాంటి ఇబ్బందీ కలగలేదన్నారు..అమరావతి డిజైన్ సమయంలోనే వరద ఇబ్బందులు లేకుండా కాల్వలు,రిజర్వాయర్లు ప్రతిపాదనలు చేశామన్నారు..
కొండవీటి వాగు,పాల వాగు ల ప్రవాహంతో పాటు గ్రావిటీ కెనాల్స్ డిజైవ్ చేశామని మంత్రి చెప్పారు..వచ్చే వర్షాకాలం నాటికి ఈ మూడు కెనాల్స్ ను పూర్తి చేసేలా త్వరలోనే టెండర్లు పిలుస్తాం.అనంతవరం నుంచి ఉండవల్లి వరకూ 23.6 కిమీలతో కొండవీటి వాగు,దొండపాడు నుంచి కృషాయపాలెం వరకూ 16.7 కి.మీ మేర పాల వాగు,వైకుంఠపురం గ్రావిటీ కెనల ను 8 కిమీ మేర అభివృద్ధి చేస్తామన్నారు..
మొత్తం 48.3 కి.మీ మేర ఈ మూడు కాలువలు అభివృద్ధి చేస్తాం.వాగులు కొన్ని చోట్ల ఉండాల్సిన దానికంటే కూచించుకుపోయిందన్నారు. గత వండేళ్లలో కృష్ణా నదికి వచ్చిన వరద ప్రవాహాన్ని పరిగణనలోకి తీసుకుని మూడు కాల్వలు అభివృద్ధి చేస్తున్నామని మంత్రి చెప్పారు.వీటితో పాటు 6 రిజర్వాయర్లు నిర్మాణం కూడా చేపడుతున్నట్లు మంత్రి నారాయణ చెప్పారు..
భవనాలపై ఐఐటి నిపుణులు నివేదిక:- రాజధాని లో 2014 – 2019 మధ్య నిర్మించిన భవనాలు మధ్యలోనే నిర్మాణాలు నిలిచిపోయాయని తెలిపారు..గత ప్రభుత్వం వాటిని పట్టించుకోకపోవడంతో ఆయా భవనాలు సామర్థ్యం ఎలా ఉందనే దాని పై ప్రభుత్వం దృష్టి పెట్టిందని చెప్పారు..దీని కోసం ఐఐటి హైదరాబాద్,ఐఐటి చెన్నైలకు భవనాలు పరిస్థితిపై అధ్యయనం చేసి నివేదిక ఇవ్వాలని కోరిందని,,ఈ నివేదిక ప్రభుత్వానికి అందిందని తెలిపారు..ఐకానిక్ భవనాలైన సెక్రటేరియట్ టవర్లు,హై కోర్టు తో పాటు అధికారులు,ఉద్యోగుల కోసం నిర్మాణం చేసిన 3600 ఫ్లాట్ లకు ఎలాంటి ఇబ్బందీ లేదని,,వాటి నిర్మాణం కొనసాగించుకోవచ్చని నివేదికలు అందాయన్నారు.ఆయా నిర్మాణాల పనులకు రాబోయే రెండు నెలల్లో టెండర్లు పిలుస్తామన్నారు..ఐకానిక్ భవనాల రాఫ్ట్ ఫౌండేషన్ కూడా బలంగా ఉందన్నారు.