దుర్గ గుడిలో ప్రత్యేక పూజలు చేసిన మారిషష్ దేశఅధ్యక్షులు ధర్మంబీర్
అమరావతి: విజయవాడ దుర్గ గుడిలో అమ్మవారికి సోమవారం ఉదయం మార్షష్ అధ్యక్షులు ధర్మం బీర్ చేరుకుని ప్రత్యేక పూజలు చేశారు. అమ్మవారి ఆలయానికి అయన విచ్చేసిన సందర్భంలో దేవదాయ శాఖ కమిషనర్ రామచంద్ర మోహన్, దేవస్థానం చైర్మన్ రాధాకృష్ణ, దేవస్థానం కార్యనిర్వాహణాధికారి శీనానాయక్, కలెక్టర్ శ్రీ లక్ష్మి శా, నగరపోలీస్ కమిషనర్ రాజశేఖరబాబు మారిషష్ దేశఅధ్యక్షులను ఘనంగా స్వాగతించారు. విదేశీ అతిధిని ఆలయ అర్చకులు, వేద పండితులు పూర్ణ కుంభస్వాగతంతో అమ్మవారి ఆలయంలోకి తీసుకుని వెళ్లారు. మారిషష్ దేశఅధ్యక్షులు ధర్మంబీర్ గొఖోల్ దంపతులకు దుర్గామాతను దర్శనం చేసుకున్న అనంతరం దేవస్థానం వేద పండితులు వేద ఆశీర్వచనం అందించారు. దేవస్థాన అధికారులు ధర్మంబీర్ గొఖోల్ దంపతులకు అమ్మవారి చిత్రపటం, ప్రసాదాలు అందజేశారు.
మార్షష్ అధ్యక్షులు ధర్మం బీర్,తెలుగు మహాసభల్లో పాల్గొంనేందుకు విజయవాడకు వచ్చిన సందర్బంలో అమ్మవారిని దర్శించుకున్నారు.

