దక్షిణాదిలో జనాభా శాతం కంటే ఎక్కువ సీట్లు పెరుగుతాయి-అమిత్ షా
అమరావతి: డీలిమిటేషన్పై చర్చ సందర్బంగా కేంద్ర హోంమంత్రి అమిత్ షా లోక్సభలో కీలకమైన విషయం తెలిపారు. డీలిమిటేషన్ వల్ల దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం జరుగుతుందని అంటున్నారని అయితే వాస్తవానికి దక్షిణాదిలో జనాభా శాతం కంటే ఎక్కువ సీట్లు పెరుగుతున్నాయన్నారు.ఆంధ్రప్రదేశ్ లోని 25 సీట్ల నుంచి 38 సీట్ల వరకు, తెలంగాణలో లోక్సభ సీట్లు 17 నుంచి 26కు పెరిగుతాయని,తమిళనాడులో 39 నుంచి 59కి, కర్ణాటకలో 28 నుంచి 42కి, కేరళలో 20 నుంచి 30కి సీట్లు పెరుగుతాయన్నారు. మొత్తంగా 50 శాతం సీట్లు పెరుగుతాయన్నారు. డీలిమిటేషన్పై విపక్షాలు తప్పుడు ప్రచారం చేస్తున్నాయని, దక్షిణాది రాష్ట్రాలకు ఎలాంటి అన్యాయమూ జరగదని అమిత్ షా స్పష్టం చేశారు

