రాష్ట్రంలో 3 రోజులు మోస్తరు నుంచి భారీ వర్షాలు పడే అవకాశం- విపత్తుల నిర్వహణ సంస్థ
అమరావతి: ఉపరితల ఆవర్తన ప్రభావంతో రాష్ట్రంలో 3 రోజులు పిడుగులతో కూడిన మోస్తరు నుంచి భారీ వర్షాలు పడే అవకాశం వుందని విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది.. అల్లూరి, ఏలూరు, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు జిల్లాల్లో పలుచోట్ల మోస్తరు నుంచి భారీ వర్షాలు మిగతా జిల్లాల్లో కొన్నిచోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం వుందన్నారు..గురువారం నుంచి మత్స్యకారులు వేటకు వెళ్ళరాదని,, తీరం వెంబడి గంటకు 40 -60 కి.మీ వేగంతో ఈదురు గాలులు వీస్తాయని తెలిపారు.. ప్రజలు చెట్ల క్రింద, శిథిలావస్థలో ఉన్న భవనాలు, హోర్డింగ్స్ వద్ద ఉండరాదు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.