బ్రూనైకు చేరుకున్న ప్రధాని మోదీ-ఘనస్వాగతం పలికిన క్రౌన్ ప్రిన్స్
అమరావతి: భారత ప్రధాని నరేంద్ర మోదీ మంగళవారం బ్రూనైకు చేరుకున్నారు..క్రౌన్ ప్రిన్స్ అల్-ముహతాది ప్రధాని మోదీకి ఘనస్వాగతం పలికారు.. బ్రూనై పర్యటన చేసిన మొదటి భారత ప్రధానమంత్రిగా నరేంద్ర మోదీ చరిత్ర సృష్టించారు..భారత ప్రధానిగా మోదీ తొలి ద్వైపాక్షిక పర్యటన ఇదే కావడం విశేషం..బ్రూనై సుల్తాన్ హాజీ హసనల్ బల్కియా ఆహ్వానం మేరకు ప్రధాని మోదీ ఇక్కడికి చేరుకున్నారు..ప్రధాని నరేంద్ర మోదీ నేటి నుంచి మూడు రోజులపాటు బ్రూనై, సింగపూర్లో పర్యటించనున్నారు.. సెప్టెంబర్ 3, 4 తేదీల్లో ప్రధాని మోదీ బ్రూనైలో పర్యటిస్తారు..భారత్-బ్రూనై మధ్య దౌత్య సంబంధాలు 40 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా ఈ పర్యటన కొనసాగుతోంది..బ్రూనై పర్యటన అనంతరం ప్రధాని మోదీ, సింగపూర్ ప్రధాని ఆహ్వానం మేరకు ఆయన ఆ దేశాన్ని సందర్శించనున్నారు.. ముస్లిం దేశమైన బ్రూనైలో 2021 జనాభా గణన ప్రకారం 44 లక్షల మందికి పైగా ముస్లిం ప్రజలు నివసిస్తున్నారు..జనాభాలో 82 శాతం మంది ముస్లింలు, 8 శాతం క్రైస్తవులు, 7 శాతం బౌద్ధులు, 4 శాతం ఇతర మతాల వారు ఉన్నారు..బ్రూనైలో భారతీయులు వైద్యం, విద్యా బోధన, ఇంధన రంగాలతో సంబంధం కలిగి ఉన్నారు..భారత హైకమిషన్ అధికారిక వెబ్సైట్ ప్రకారం, 14,500 మంది భారతీయులు ఇక్కడ పనిచేస్తున్నారు..