గోవాలో చోటు చేసుకున్న దుర్ఘటనలో ఆరుగురు భక్తులు మృతి
అమరావతి: గోవాలో చోటు చేసుకున్న దుర్ఘటనలో ఆరుగురు భక్తులు మృతి చెందారు..మరో 50 మందికి పైగా భక్తులు త్రీవంగా గాయపడ్డారు.. సంఘటనాస్థలాన్ని పరిశీలించిన గోవా సీఎం ప్రమోద్ సావంత్ తొక్కిసలాటలో గాయపడిన వారిని పరామర్శించారు.. ఈ ప్రమాదంపై రాష్ట్రపతి, ప్రధానమంత్రి స్పందించారు..శిర్గావ్లోని శ్రీ లైరాయ్ ఆలయంలో శుక్రవారం నుంచి వార్షిక జాతర ప్రారంభమైంది.. దీంతో లైరాయ్ అమ్మవారిని దర్శించుకునేందుకు గోవా నలుమూలల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు వచ్చారు.. ఆ ఆలయంలో అనాదిగా వస్తున్న ‘నిప్పులపై నడిచే’ ఆచారం ఉంది.. శనివారం జరిగిన ఈ కార్యక్రమంలో వేలాది మంది పాల్గొనడంతో ఒక్కసారిగా రద్దీ పెరిగి భక్తులు ఒకరినొకరు తోసుకోవడంతో తొక్కిసలాట జరిగింది.. ఈ ప్రమాదంలో ఆరుగురు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయినట్లు గోవా పోలీసులు వెల్లడించారు..సహాయక చర్యలు చేపట్టిన పోలీసులు క్షతగాత్రులను సమీపంలోని ఆసుపత్రికి తరలించారు..జాతర దృష్ట్యా వచ్చే రద్దీని నియంత్రించేందుకు ఆలయ నిర్వాహకులు ఎలాంటి ఏర్పాట్లు చేయకపోవడం వల్లే ఈ దుర్ఘటన జరిగిందని పోలీసులు భావిస్తున్నారు.. తొక్కిసలాట ఘటనపై రాష్ట్రపతి దౌప్రది ముర్ము,, ప్రధానంత్రి నరేంద్ర మోదీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.