DISTRICTS

ఉమ్మడి నెల్లూరు జిల్లాలో మూడు డయాలసిస్ సెంటర్లు-వైద్య ఆరోగ్య శాఖ మంత్రి

నెల్లూరు: కూటమి ప్రభుత్వం 10 నెలలుగా వైద్య ఆరోగ్య రంగంలో పెను మార్పులకు శ్రీకారం చుట్టినట్లుగా రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్య కుమార్ తెలిపారు..శనివారం ఉదయగిరి నియోజకవర్గంలోని వింజమూరు సామాజిక ఆరోగ్య కేంద్రంలో 5 పడకల డయాలసిస్ సెంటర్ ను మంత్రి సత్య కుమార్ ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ అత్యంత వెనుకబడిన ఉదయగిరి నియోజకవర్గం తన సొంత నియోజకవర్గo లాంటిదన్నారు.. ప్రధానమంత్రి నేషనల్ డయాలసిస్ పథకం కింద గత ప్రభుత్వంలో 5 సంవత్సరాల కాలంలో కేవలం 21 ఏర్పాటు చేస్తే, ప్రస్తుత కూటమి ప్రభుత్వం పది నెలల్లో రాష్ట్రవ్యాప్తంగా 18 డయాలసిస్ సెంటర్లను ఏర్పాటు చేసిందన్నారు. అందులో ఉమ్మడి నెల్లూరు జిల్లాలో మూడు డయాలసిస్ సెంటర్లు మంజూరు చేశామని తెలిపారు. రాష్ట్రంలో డయాలసిస్ రోగులు పెరుగుతున్న వైనంపై శాస్త్రీయంగా పరిశోధించామని, కేవలం గత ప్రభుత్వంలో నాణ్యతలేని మద్యం తాగటం వల్లనే కిడ్నీ కేసులు విపరీతంగా పెరిగినట్లుగా గమనించామన్నారు. గత ప్రభుత్వం ప్రజారోగ్యంతో చెలగాటమాడటంతో కొన్ని వేల కుటుంబాలు ఆర్థికంగా చితికిపోయి రోడ్డున పడ్డాయన్నారు. అయితే ప్రస్తుత ప్రభుత్వం నాణ్యమైన మెరుగైన అందించేందుకు కృషి చేస్తున్నామన్నారు. ఎన్టీఆర్ వైద్య సేవ కింద 4200 కోట్ల రూపాయల నిధులను వ్యయం చేస్తున్నామన్నారు..ఉదయగిరి నియోజకవర్గంలో పిపిపి పద్ధతిలో 100 నుండి 200 పడకల మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రి నిర్మించేందుకు అనుమతిస్తున్నామన్నారు..ఈ కార్యక్రమంలో జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ సుజాత, మునుస్వామి,బిజెపి జనసేన నాయకులు పాల్గొన్నారు.

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *