NATIONALOTHERSWORLD

బలూచ్‌ లిబరేషన్‌ ఆర్మీ చేతిలో పాకిస్తాన్ ఆర్మీకి భారీ ఎదురు దెబ్బ

అమరావతి: ఉగ్రవాదులను తయారు చేసే ఫ్యాక్టరీ అయిన పాకిస్థాన్‌కు (BLA) బలూచ్‌ లిబరేషన్‌ ఆర్మీ నుంచి గట్టి ఎదురుదెబ్బ తగిలింది..జాఫర్‌ ఎక్స్‌ ప్రెస్‌ హైజాక్ చేసి బందీలుగా అదుపులోకి తీసుకున్న 214 మంది పాక్‌ సైనికులను  హతమార్చినట్లు బలూచిస్థాన్‌ లిబరేషన్‌ ఆర్మీ తాజాగా ప్రకటించింది.. బలూచిస్థాన్ కు చెందిన రాజకీయ ఖైదీలను విడుదల చేయాలని పాక్‌ ఆర్మీకి విధించిన 48 గంటల గడువు, శుక్రవారంతో ముగిసినట్లు పేర్కొంది..పాక్‌ ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన రాకపోవడంతో బందీలుగా అదుపులోకి తీసుకున్న 214 మంది పాక్‌ సైనికులను చంపేసినట్లు ప్రకటించింది..అంతకు ముందు పాకిస్తాన్ ఒక ప్రకటన విడుదల చేస్తూ, 30 గంటల ఆపరేషన్‌ తర్వాత 33 మంది తీవ్రవాదులను కాల్చివేశామని, 21 మంది ప్రయాణికులు, నలుగురు పాకిస్థానీ సైనిక సిబ్బంది కూడా మరణించారని పాక్‌ ప్రకటించింది..

పాకిస్తాన్ తప్పుడు ప్రచారం:- జాఫర్‌ ఎక్స్‌ ప్రెస్‌ హైజాక్‌ ఘటనలో తమ ఆపరేషన్‌ ముగిసిందని పాక్‌ సైన్యం చేసిన ప్రకటనను బలూచ్‌ లిబరేషన్‌ ఖండించింది.. తప్పుడు ప్రచారం ద్వారా ప్రజలను తప్పుదారి పట్టించేందుకు పాకిస్థానీ సైన్యం ప్రయత్నిస్తోందని BLA మండిపడింది.. ఖైదీల మార్పిడికి తాము ప్రతిపాదించగా,,ఇందుకు పాకిస్థాన్‌ నిరాకరించి తన సైనికులను గాలికి వదిలేసిందనిఆరోపించింది..యుద్ధ క్షేత్రంలో వాస్తవ పరిస్థితులను తెలుసుకునేందుకు స్వతంత్ర జర్నలిస్టులను పంపాలని పాక్‌ ప్రభుత్వానికి BLA ప్రతిపాదించింది.. బలూచ్‌ లిబరేషన్‌ ఆర్మీకి- పాకిస్థాన్‌ భద్రతా సిబ్బందికి మధ్య భీకర పోరు కొనసాగుతోందని, పాకిస్థానీ దళాలు భారీ నష్టాన్ని చవిచూస్తున్నాయని BLA వెల్లడించింది.. పాకిస్థానీ సైన్యం యుద్ధ రంగంలో గెలవడం కాని బందీలను విడుదల చేయడం కాని జరగలేదని BLA తెలిపింది.

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *