పాకిస్తాన్ ఆర్మీ హెడ్ క్వార్టర్స్,ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థను ధ్వంసం-కల్నల్ ఖురేషి
అమరావతి: పాకిస్తాన్,క్షిపణులను ఉపయోగించి ఉత్తర,,పశ్చిమ భారతదేశంలోని అనేక సైనిక లక్ష్యాలను లక్ష్యంగా చేసుకోవడానికి ప్రయత్నించింది..దింతో పాకిస్తాన్పై భారత్ ఆపరేషన్ సిందూర్ ఇంకా కొనసాగుతోంది..S-400 ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్తో పాక్ మిస్సైల్స్ నిర్వీర్యం చేసిన భారత్,, పాక్ ఆర్మీ హెడ్ క్వార్టర్స్ ధ్వంసం చేసింది..పాకిస్తాన్ లోని కీలక నగరాలే టార్గెట్గా భారత్ డ్రోన్ల దాడి చేస్తోంది..ఆపరేషన్ సిందూర్పై విదేశాంగ,,రక్షణ శాఖ సంయుక్తంగా మీడియా సమావేశం నిర్వహించి సంచలన విషయాలను వెల్లడించారు..
ఈ ఆపరేషన్ గురించి కల్నల్ సోఫియా ఖురేషి మాట్లాడుతూ,,గత రాత్రి నుంచి భారత్పై జరిగిన ప్రతి దాడిని తిప్పికొట్టామన్నారు..ఉత్తర, పశ్చిమ భారతదేశంలోని 15 ప్రాంతాలపై దాడులకు పాక్ యత్నించిందని,, పాకిస్తాన్ ప్రయోగించిన మిస్సైల్స్ ను గాల్లోనే పేల్చేశామని వివరించారు..అవంతిపురా, శ్రీనగర్, జమ్మూ, పఠాన్కోట్, అమృత్సర్, కపుర్తలా, నల్, జలంధర్, లూథియానా, అడంపూర్, భటిండా, చండీగఢ్, ఫలోడి, ఉత్తర్లై మరియు భుజ్ వంటి ప్రదేశాలు ఉన్నాయని తెలిపారు..భారతదేశం,పాకిస్తాన్ దాడులను నిర్వర్యం చేస్తునే,, లాహోర్ లోని ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థను ధ్వంసం చేశామన్నారు.