CRIMENATIONAL

పటాసుల తయారీ ఫ్యాక్టరీలో ఘోర అగ్నిప్రమాదం-13 మంది మృతి

అమరావతి: గుజరాత్‌లోని బనస్కాంత జిల్లా, దీశ పట్టణంలో ఉన్న పటాసుల తయారీ ఫ్యాక్టరీలో మంగళవారం వరుస పేలుళ్లు సంభవించడంతో,,పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి.. ఫ్యాక్టరీలో చోటుచేసుకున్న ఈ సంటనలో మొత్తం 13 మంది మరణించగా మరో ఆరుగురు తీవ్రంగా గాయపడ్డారు.. పేలుళ్ల ధాటికి ఫ్యాక్టరీ పైకప్పు కుప్పకూలిపోవడంతో శిథిలాల కింద మరికొంత మంది కూలీలు చిక్కుకుపోయారు.. సమాచారం అందుకున్న పోలీసులు, అగ్ని మాపక సిబ్బంది హుటా హుటిన సంఘటనా స్థలానికి చేరుకుని,, సహాయక చర్యలు చేపట్టారు.. గాయపడ్డ వారిని దగ్గరలోని ఆస్పత్రికి తరలించి,,శిథిలాల కింద చిక్కుకుపోయిన వారిని బయటకు తీస్తున్నారు.. ఈ సంఘటనపై దీశ రూరల్ పోలీస్ స్టేషన్ ఇన్‌స్పెక్టర్ విజయ్ చౌదరి మాట్లాడుతూ,, ‘ దీశ ఇండస్ట్రియల్ ఏరియాలో భారీ పేలుడు సంభవించినట్లు ఉదయం మాకు సమాచారం అందింది.. అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని మంటల్ని అదుపులోకి తీసుకుని వచ్చారు..పేలుడు చాలా భారీ స్థాయిలో జరిగడంతో ఫ్యాక్టరీ స్లాబ్ మొత్తం కూలిపోయిందన్నారు.. స్లాబ్ కింద ఇరుక్కుపోయిన వారిని బయటకు తీయడానికి ప్రయత్నిస్తున్నాము’ అని తెలిపారు..కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నమన్నారు.

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *