MOVIESNATIONALOTHERS

“కనెక్టింగ్‌ క్రియేటర్స్‌….కనెక్టింగ్‌ కంట్రీస్‌” (waves)-ప్రధానమంత్రి

అమరావతి: వరల్డ్‌ ఆడియో విజువల్‌ అండ్‌ ఎంటర్టైన్మెంట్‌ సమ్మిట్‌ను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గురువారం ప్రారంభించారు.. ముంబైలోని జియో వరల్డ్ కన్వెన్షన్ సెంటర్‌లో 4 రోజులపాటు ప్రతిష్ఠాత్మకంగా వేవ్స్ సమ్మిట్‌ జ‌రుగుతుంది. “కనెక్టింగ్‌ క్రియేటర్స్‌….కనెక్టింగ్‌ కంట్రీస్‌” అనే ట్యాగ్ లైన్ తో ఈ వేవ్స్ సమ్మిట్ ను నిర్వ‌హిస్తున్నారు. మీడియా,, వినోద పరిశ్రమల‌ను ఒక వేదికపై తీసుకుని వచ్చే ప్రోగ్రామ్‌..ఈ కార్య‌క్ర‌మానికి మీడియా,, వినోద రంగానికి చెందిన సీఈఓలు,, పరిశ్రమల‌కి చెందిన ప్ర‌ముఖులు హాజ‌రు కానున్నారు..

వేవ్స్ అనేది కేవలం ఒక పదం కాదని….ఇది సంస్కృతి,, సృజనాత్మకత,, చలనచిత్ర సంగీతం,, గేమింగ్,, కథ చెప్పడం అనే విభాగల కలయిక అని ప్రధాని మోదీ అన్నారు..గ‌త 100 సంవత్సరాల్లో భార‌తీయ సినిమా ఉన్న‌త శిఖ‌రాల‌కి  చేరుకుంద‌ని ప్ర‌ధాని తెలిపారు..ఈ సమ్మిట్‌లో బాలీవుడ్ నటులు అమితాబ్ బచ్చన్,, రణ్‌బీర్ కపూర్,,దీపికా పదుకొనే,, ప్రియాంక చోప్రా,, రజనీకాంత్,, చిరంజీవి,, మోహన్ లాల్ సహా ఇతర ప్రపంచ స్థాయి నటీనటులు సందడి చేశారు..ఈ సందర్బంలో మోహ‌న్ లాల్,, ర‌జనీకాంత్,, హేమ మాలిని,, చిరంజీవి,, అక్ష‌య్ కుమార్,, మిథున్ చ‌క్ర‌వ‌ర్తి క‌లిసి ఓ గ్రూప్ ఫొటోకు ఫోజులిచ్చారు.

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *