AP&TG

రాష్ట్ర అభివృద్ధిలో ఉపాధి హామీ పథకం వెన్నెముకలా నిలిచింది-ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్

దేవుడిని దగ్గర నుంచి చూశాను,అయ్,
అమరావతి: గత పాలకులు అనుసరించిన విధానలతో రాష్ట్రం ఆర్దికంగా కష్టాల్లో పడిపోయిందని ఇలాంటి పరిస్థితుల్లో రాష్ట్ర అభివృద్ధిలో ఉపాధి హామీ పథకం వెన్నెముకలా నిలిచిందని ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అన్నారు..గురువారం మే డే సందర్బంగా అయన మాట్లాడుతూ దేశ ఆర్థికాభివృద్ధిలో కార్మికుల భాగస్వామ్యం కీలకం. సమాజ శ్రేయస్సులో భాగమవుతున్న వీరందరికీ కార్మిక దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు..ఉపాధి హామీ శ్రామికుల సంక్షేమానికి కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు.. ఉపాధి హామీ పథకం ద్వారా 75.23 లక్షల మందికి సొంత ఊళ్లలోనే ఉపాధి పొందుతున్నరని,,శిథిలమైన రాష్ట్ర ఆర్థిక వ్యవస్థకు పంచాయతీరాజ్ నిధులే ప్రాణంపోశాయన్నారు.. మద్యం అమ్మకాల్లో గత పాలకులు రూ. 3200 కోట్లు నొక్కేశారని,,సారాయి సాణువుల మీద కోట్లు కూడబెట్టారని మండిపడ్డారు.. నీటి సంక్షోభ నివారణకు ప్రత్యేక కార్యచరణతో ముందుకు వెళ్తాం అన్నారు.. ప్రతి ఒక్కరు బాధ్యతగా నీటిని వినియోగించాలని,, నీటి పరిరక్షణపై పాఠశాల, కాలేజీ విద్యార్థులతో అవగాహన ర్యాలీలు, ప్రచారాలు చేయిస్తామన్నారు.. ప్రకృతి నుంచి వచ్చే ప్రతి నీటి బొట్టును ఒడిసి పట్టుకొవాలని కోరారు.. వేసవిలో విద్యార్థులకు, యువతకు నీటి సంరక్షణలో అవగాహనా కార్యక్రమాల్లో భాగం చేసేందుకు, వారికి వేసవి ఇంటర్న్ షిప్ ద్వారా గౌరవ వేతనాలు, సర్టిఫికెట్లు ఇచ్చి ప్రోత్సహిస్తాం అని వెల్లడించారు.. నీటి సంరక్షణ, నీటి వనరుల పర్యవేక్షణ తాగునీటి సమస్యలను ఎదుర్కొనే ప్రక్రియలో వీరి సహకారం తీసుకుంటామన్నారు..”13,326 పంచాయతీలు బాధ్యతగా పన్ను కడితే మన ప్రాథమిక అవసరాలు మనమే తీర్చుకోగలుగుతాం” అని అన్నారు.. కార్యక్రమంలో పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ ప్రధాన కార్యదర్శి శశిభూషణ్ కుమార్, కమిషనర్ కృష్ణతేజ, ఎన్.ఆర్.ఈ.జి.ఎస్. సంచాలకులు షణ్ముఖ్, ఇతర ఉన్నతాధికారులు,శ్రామికులు పాల్గొన్నారు.

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *