భారత్, పాక్ మధ్య కాల్పుల విరమణ ఒప్పందం జరిగింది-విదేశాంగ కార్యదర్శి విక్రమ్ మిస్రీ
పహల్గామ్ మరణకాండ తరువాత భారతదేశం,, పాకిస్తాన్ పై ముప్పెట దాడులు చేయడంతో గుక్కతిప్పుకోలేని స్థితిలోకి వెళ్లిన ధూర్తదేశం,, అమెరికా ముందు సాగిల పడి, రాయబారం కోసం వేడుకోగా, ట్రంప్,ప్రధానిమోదీతో చర్చించడంతో, భారతదేశం అపరేషన్ సింధూర్ కు విరామం ప్రకటించింది.
అమరావతి: భారత్, పాక్ యుద్ధంపై కీలక ప్రకటన చేశారు.. ఇరు దేశాల మధ్య కాల్పుల విరమణ ఒప్పందం జరిగిందని తెలిపారు… “పాకిస్తాన్ డైరెక్టర్స్ జనరల్ ఆఫ్ మిలిటరీ ఆపరేషన్స్ (DGMO) ఈ మధ్యాహ్నం 3:35 గంటలకు భారత DGMO కి ఫోన్ చేశారు..భారత ప్రామాణిక సమయం ప్రకారం 5.00 గంటల నుండి భూమిపై, గాలిలో, సముద్రంలో అన్ని రకాల కాల్పులు, సైనిక చర్యలను నిలిపివేయాలని వారి మధ్య ఒప్పందం కుదిరింది..ఈ అవగాహనను అమలు చేయడానికి రెండు వైపులా సూచనలు ఇవ్వబడ్డాయి.. డైరెక్టర్స్ జనరల్ ఆఫ్ మిలిటరీ ఆపరేషన్స్ మే 12న 12:00 గంటలకు మళ్ళీ మాట్లాడుకుంటారు.” అని విదేశాంగ కార్యదర్శి విక్రమ్ మిస్రీ తెలిపారు.
కాల్పుల విరమణకు అంగీకరించాము–పాక్ ప్రకటన
భారత్-పాకిస్థాన్ తక్షణ కాల్పుల విరమణకు అంగీకరించినట్లు పాక్ విదేశాంగ మంత్రి ఇషక్ దర్ వెల్లడించారు..ఈ విషయమై ఎక్స్ వేదికగా కీలక ప్రకటన చేశారు..
ఉగ్రవాదంపై రాజీ లేని వైఖరి అలాగే కొనసాగుతుంది–ఎస్ జైశంకర్
“భారతదేశం-పాకిస్తాన్ శనివారం కాల్పులు & సైనిక చర్యలను నిలిపివేయడంపై ఒక అవగాహనను కుదుర్చుకున్నాయి.. ఉగ్రవాదం అన్ని రూపాలు, వ్యక్తీకరణలకు వ్యతిరేకంగా భారతదేశం స్థిరంగా దృఢమైన, రాజీలేని వైఖరిని కొనసాగించింది..ఇది అలాగే కొనసాగుతుంది” అని విదేశాంగశాఖ మంత్రి డాక్టర్ ఎస్ జైశంకర్ పేర్కొన్నారు..
భారత్-పాక్ మధ్య తక్షణ కాల్పుల విరమణ-డొనాల్డ్ ట్రంప్
తక్షణ కాల్పుల విరమణకు భారత్-పాక్ అంగీకరించినట్లు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు.. అమెరికా మధ్యవర్తిత్వంతో రాత్రంతా చర్చలు జరిగాయని ఎక్స్ లో వెల్లడించారు.. భారత్, పాక్ వెంటనే కాల్పులు ఆపేందుకు అంగీకరించినట్లు ప్రకటించారు.. రెండు దేశాలు శాంతికి ముందడుగు వేశాయని అభినందించారు.