NATIONAL

ఢిల్లీ నూతన ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన అతిశీ మార్లిన్

అమరావతి: దేశ రాజధాని ఢిల్లీ నూతన ముఖ్యమంత్రిగా అతిశీ మార్లిన్ సింగ్ శనివారం సాయంత్రం ప్రమాణ స్వీకారం చేశారు.. రాజ్‌భవన్‌లో నిరాడంబరంగా ప్రమాణ స్వీకార కార్యక్రమం జరిగింది.. లెఫ్టినెంట్ గవర్నర్ వినయ్ కుమార్ సక్సేనా ఆమెతో ప్రమాణం చేయించారు..దేశ రాజధానికి 8వ యువ ముఖ్యమంత్రి,,3వ మహిళ ముఖ్యమంతిగాకావడం విశేషం.. అతిషితోపాటు కేబినెట్‌లో సౌరభ్ భరద్వాజ్, కైలాష్ గహ్లోత్, గోపాల్ రాయ్, ఇమ్రాన్ హుస్సేన్, ముఖేష్ అహ్లావత్ కూడా ప్రమాణ స్వీకారం చేశారు..ఈ కార్యక్రమానికి ఆప్ అధినేత, మాజీ సీఎం అరవింద్ కేజ్రీవాల్, మాజీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోదియా, ఆప్ నేతలు హాజరయ్యారు.

అతిషీ తండ్రి విజయకుమార్ సింగ్ పక్క కరుడు కట్టిన కమ్యూనిస్టు,(రెవల్యూషన్) అనే మాస పత్రికకు పనిచేస్తున్నారు..అలాగే అమె తల్లి తృప్తివాహీ కూడా కమ్యూనిస్టు సిద్దాతలను నమ్మి అచరిస్తూన్న వారే.. పార్లమెంట్ పై దాడికి పాల్పపడిన ఆప్జల్ గురుకు క్షమాభిక్ష పెట్టాలన్న పీటిషన్ ను సమర్దించిన వ్యక్తి..వీరిద్దరు ఢిల్లీ యూనివర్సీటిలో ప్రోఫసర్స్ గా పనిచేస్తున్నారు..అందుకే అతిషీ పేరు మధ్యలో “మార్లిన్ (మార్కిస్టు&లెనిన్ట్)” పేర్లు కలిసి వచ్చేలా పేరు పెట్టారు..తన రాజకీయ జీవితంలో తన పేరు అడ్డు రాకుడదన్నా ఉద్దేశంతో అతిషీ ఒక ఆఫిడివిట్ ద్వారా మార్లిన్ అనే పదం తొలగించుకున్నారు.

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *