రామమందిరంపై దాడికి సిద్దం అవుతున్న టెర్రరిస్టును అరెస్టు
అమరావతి: గుజరాత్ ATS & హర్యానా STF సంయుక్త ఆపరేషన్లో, ఆదివారం సాయంత్రం హర్యానాలోని పాలి గ్రామంలో అనుమానిత ఉగ్రవాదిని అరెస్టు చేశారు..అతని నుంచి రెండు గ్రెనేడ్లు, విప్లవ సాహిత్యం స్వాధీనం చేసుకుంది.. కేంద్ర ఏజెన్సీలు, ఫరీదాబాద్ ఎస్టీఎఫ్ సహకారంతో గుజారాత్ ఏటీఎస్ ఈ గాలింపు చర్యలు చేపట్టింది.. రామమందిరంపై దాడి చేయడమే, టెర్రరిస్టు టార్గెట్లలో ఒకటిగా ఉన్నట్టు విశ్వసనీయవర్గాలు తెలిపాయి.. ఫరిదాబాద్లో అరెస్టయిన వ్యక్తిని ఉత్తరప్రదేశ్కు చెందిన 19 ఏళ్ల అబ్దుల్ రెహ్మాన్గా గుర్తించారు.. అతని వద్ద నుంచి స్వాధీనం చేసుకున్న గ్రెనేడ్లను నిర్వీర్వం చేశారు..రెహ్మా్న్కు టెర్రరిస్టు సంస్థలతో ఉన్న సంబంధం, అతని టార్గెట్కు సంబంధించి మరింత సమాచారం రాబట్టేందుకు అతన్ని గుజరాత్కు తరలించారు.. రెహ్మాన్ అరెస్టుతో భారీ ఉగ్రదాడి కుట్ర భగ్నమైనట్టు చెబుతున్నారు..గుజరాత్ ఏటీఎస్ చేపట్టిన ఆపరేషన్ ఇంకా కొనసాగుతున్నట్టు అధికారులు చెప్పారు.