AP&TG

బంగాళాఖాతంలో ఆల్పపీడనం-11 నాటికి వాయుగుండగా మారే అవకాశం

అమరావతిం ఆగ్నేయ బంగాళాఖాతం & దానిని ఆనుకుని ఉన్న తూర్పు ఈక్వటోరియల్ హిందూ మహాసముద్రం మీదుగా ఉన్న ఆవర్తనం ప్రభావంతో, శనివారం అదే ప్రాంతంలో అల్పపీడనం ఏర్పడిందని వాతావరణశాఖ తెలిపింది.. ఇది రాబోయే 24 గంటల్లో మరింతగా బలపడే అవకాశం ఉందని వెల్లడించింది.. ఇది పశ్చిమ-వాయువ్య దిశగా కొనసాగుతూ డిసెంబర్ 11 నాటికి శ్రీలంక-తమిళనాడు తీరాలకు ఆనుకుని నైరుతి బంగాళాఖాతంకు చేరే అవకాశం ఉందని పేర్కొంది.. శ్రీకాకుళం, విజయనగరం,మన్యం, అల్లూరి, విశాఖపట్నం,అనకాపల్లి, కాకినాడ, కోనసీమ,తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి, ఏలూరు, కృష్ణా జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి వర్షం కురిసే అవకాశం ఉందని తెలిపింది.

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *