AP&TG

జూన్ ఒకటి నుంచి రేషన్ షాపుల్లో రేషన్ పంపణీకి సర్వం సిద్ధం-మంత్రి నాదెండ్ల మనోహర్

అమరావతి: కార్డుదారుల సౌలభ్యం కోసం జూన్ ఒకటో తేది నుంచి రేషన్ షాపుల ద్వారా రేషన్ సరుకులు పంపిణీకి సర్వం సిద్ధం అని పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ చెప్పారు.MDU విధానం అమలులో ఉన్నపుడు ఈ పోస్లో ఉన్న softwareను తొలగించి రేషన్ డీలర్ ద్వారా పంపిణీ కోసం రూపోందించిన software క్షేత్ర స్థాయిలో పరిశీలించే నిమిత్తం విజయవాడ మధురానగర్ రేషన్ డిపో నెంబరు 218ని పౌరసరఫరాశాఖ కమీషనర్ సౌరబ్ర్తో కలిసి సందర్శించారు.పోస్లో లాగిన్ నుండి కార్డు నెంబరు ఎంటర్ అయ్యే విధానం కార్డుదారుని వేలిముద్ర, కంటిపాప ద్వారా సరుకులు నమోదయ్యే విధానం పరిశీలిం చారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ గతంలో MDU వాహనం ఎపుడు వస్తుందో వెళుతుందో తెలియని దుస్తితి ఉందని దీంతో కార్డుదారులు రేషన్ కోసం వాహనం కోసం రోడ్ల మీద తిరగాల్సిన పరిస్థితి ఉందని ఇపుడు కార్డుదారులకు ఆ కష్టాలు ఉండవని చెప్పారు. నెలలో ఒకటో తేది నుండి 15వ తేది వరకు ఉదయం 8 నుండి మద్యహ్నం 12 వరకు సాయంత్రం నాలుగు నుంచి 8 గంటల వరకు రేషన్ దుకాణంలో సరుకులు తీసుకోవచ్చని చె ప్పారు.

65 సంవత్సరాలు దాటిన ఒంటరి వృద్ధులు, వికలాంగులు, భార్యభర్తలు ఇద్దరు వృద్దులైన వారి జాబితాలు రేషన్ షాపుల వారిగా సిద్ధం చేశామని,, వారికి 1 నుంచి 5వ తేదిలోగా డీలర్ ఇంటికి వెళ్లి రేషన్ సరుకులు ఇస్తారని చెప్పారు. ఇల్లు మారి వేరే ప్రాంతాలకు వెళ్లిన వారికి కూడా పోర్టబిలిటీ విధానం ద్వారా సమీప రేషన్ దుకాణంలో రేషన్ పొందవచ్చని చెప్పారు. రేషన్ దుకాణాలలో అవినీతి జరగకుండా ప్రభుత్వం సరికోత్త యాప్ రూపొందించిందని తెలిపారు.ఈ యాప్ లో డీలర్ వివరాలు ఫోటోతో సహా వస్తాయన్నారు. MLS పాయంట్ నుంచి సరుకు ఎంత వచ్చింది. కార్డుదారులకు ఎంత పంపిణీ చేశారనే వివరాలు, రేషన్ దుకాణం వద్ద జనం ఎక్కువ మంది ఉన్నా వెంటనే ఈ యాప్ ద్వారా తెలుస్తుందన్నారు.

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *