ఇంటర్ ఫలితాలు విడుదల చేసిన విద్య, ఐటి శాఖల మంత్రి నారా లోకేష్
అమరావతి: విద్యార్థులు తమ ఫలితాలను ఆన్లైన్లో https://resultsbie.ap.gov.in వెబ్సైట్లో చూసుకోవచ్చు అని అలాగే, మన మిత్ర వాట్సాప్ నంబర్ 9552300009 కి “Hi” మెసేజ్ పంపితే కూడా ఫలితాలను పొందవచ్చు అని ఎక్స్ లో ఇంటర్ ఫలితాలు విడుదల చేసిన సందర్బంలో విద్య, ఐటి శాఖల మంత్రి నారా లోకేష్ అన్నారు.ఈ సంవత్సరం ఇంటర్మీడియట్ ఫలితాలలో గత పదేళ్లలో అత్యధిక ఉత్తీర్ణత శాతం నమోదైనందుకు ఆనందంగా ఉందని,,మొదటి సంవత్సరం విద్యార్థులకు 70% మరియు రెండో సంవత్సరం విద్యార్థులకు 83% ఉత్తీర్ణత శాతం నమోదైందన్నారు.. ప్రభుత్వ,,ప్రభుత్వ ఆధ్వర్యంలోని సంస్థలలో మెరుగుదల ప్రత్యేకంగా కనిపించిందని తెలిపారు.. ప్రభుత్వ జూనియర్ కళాశాలల (GJCs) లో రెండో సంవత్సరం ఉత్తీర్ణత శాతం 69%గా నమోదు కాగా, ఇది గత 10 ఏళ్లలో అత్యధికం అని, మొదటి సంవత్సరం విద్యార్థుల ఉత్తీర్ణత శాతం 47%గా ఉందని,, ఇది గత పదేళ్లలో రెండవ అత్యధిక శాతం అన్నారు.. ఈ విజయానికి విద్యార్థులు, జూనియర్ అధ్యాపకులు మరియు విద్యా పురోగతికి కృషి చేసిన ప్రతి ఒక్కరి కఠినమైన శ్రమే కారణం అని వ్యాఖ్యనించారు..ఈసారి ఉత్తీర్ణత సాధించలేకపోయిన విద్యార్థులు నిరాశ చెందాల్సిన అవసరం లేదని,, దీనిని ఒక అడుగుగా భావించి, మరింత కృషి చేసి, మరింత బలంగా తిరిగి రావాలని కోరుకుంటున్నాం అని అన్నారు.. ప్రతి విద్యార్థికి శుభాకాంక్షలు. మీరు నిరంతరం నేర్చుకుంటూ, ఎదుగుతూ, విజయాన్ని సాధించాలని కోరుకుంటున్నాను తెలిపారు.