డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ హామీ-మన్యంలో రోడ్లు నిర్మాణం కోసం రూ.275 కోట్లు విడుదల
అమరావతి: డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ గత నెల మన్యం ప్రాంతాల్లో పర్యటించి,,మారుమూల ప్రాంతాలకు రహదారి సౌకర్యం కల్పిస్తామని ఇచ్చిన హామీ మేరకు రాష్ట్ర ప్రభుత్వం రూ.275 కోట్లతో పనులు చేపట్టేందుకు పాలనానుమతి జారీ చేసింది.. ఈ మేరకు పంచాయితీరాజ్ గ్రామీణాభివృద్ధిశాఖ ముఖ్యకార్యదర్శి శశిభూషణ్ కుమార్ ఉత్తర్వులు జారీ చేశారు.. ప్రధానమంత్రి జన్ మన్ కార్యక్రమం కింద 90 మారుమూల గిరిజన గ్రామాలకు రహదారుల నిర్మాణం కోసం 2024-25 ఆర్ధిక సంవత్సరానికి గానూ 76 రహదారి పనులకు రూ.275 కోట్లు ఖర్చు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం పాలనా అనుమతులు జారీ చేసింది..అలాగే 5 సంవత్సరాల పాటు రహదారి నిర్వహణ కోసం రూ.18.76 కోట్లు ఖర్చు చేసేందుకు ఆనుమతి ఇచ్చింది.. పీఎం జన్ మన్ కార్యక్రమంలో భాగంగా కేంద్రం నుంచి రూ.163 కోట్లు, రాష్ట్ర వాటాగా రూ.111 కోట్లలను రహదారుల నిర్మాణానికి ఖర్చు చేయనున్నారు..