ఫుట్బాల్ ఆటగాళ్లకు కేంద్రంగా బోడోల్యాండ్-123వ మన్ కీ బాత్
అమరావతి: ఒకప్పుడు ఘర్షణలకు పేరుగాంచిన అస్సాంలోని బోడోలాండ్ టెరిటోరియల్ రీజియన్ (BTR) ఇప్పుడు యువత వారు పరిమిత వనరులతోనే సాధన చేసి అద్భుతంగా రాణిస్తున్నారని ప్రధాని మోదీ అన్నారు..అదివారం 123వ మన్ కీ బాత్ ఎపిసోడ్ ప్రసారమైంది.. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మాట్లాడుతూ మైదానంలో మెరిసేందుకు కష్టాలను,, సవాళ్లను అధిగమించిన ఈ ప్రాంత యువ ఫుట్బాల్ ఆటగాళ్ళు దేశవ్యాప్తంగా ఇతరులకు ప్రేరణగా నిలిచారని ప్రధాని అన్నారు.. దేశంలోని చిన్నారులకు వారు ఆదర్శంగా మారారని కొనియాడారు. ఫిట్నెస్ కాపాడుకోవడానికి, ఊబకాయం తగ్గించుకోవడానికి ఆహారంలో నూనె వినియోగాన్ని 10 శాతం తగ్గించుకోవాలని సూచించారు. అదేవిధంగా మేఘాలయ ఎరీసిల్క్ కు జీఐ ట్యాగ్ లభించిందని చెప్పారు.. పురుగులను చంపకుండా వస్త్రాన్ని తయారు చేయడం దాని ప్రత్యేకతని తెలిపారు.
భారత్ ట్రకోమా రహిత దేశమని:- ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకటించిన విషయాన్ని ప్రధాని నరేంద్రమోదీ గుర్తుచేశారు.. భారత్ ట్రకోమా రహిత దేశంగా మారడంలో కృషి చేసిన అందరికీ ఆయన అభినందనలు తెలిపారు..భారత్ బ్యాక్టీరియా ఇన్ఫెక్షన్ అయిన ట్రకోమా రహిత దేశంగా అవతరించిందని ప్రపంచ ఆరోగ్య సంస్థ ఇటీవల ప్రకటించింది..
యోగాను తమ జీవితంలో భాగం:- జూన్ 21న జరిగిన యోగాడే కార్యక్రమంలో దేశంలోనేగాక ప్రపంచవ్యాప్తంగా లక్షలమంది పాల్గొన్నారని,,దాదాపు పదేళ్ల క్రితం మొదలైన ఈ కార్యక్రమం ప్రతి సంవత్సరం మరింత విస్తరిస్తోందని తెలిపారు..ప్రపంచ వ్యాప్తంగా చాలా మంది యోగాను తమ జీవితంలో భాగం చేసుకుంటున్నారని వెల్లడించారు..
జార్జిఫెర్నాండెజ్ను సంకెళ్లతో:- 50 ఏళ్ల క్రితం దేశంలో ఎమర్జెన్సీ విధించిన వాళ్లు రాజ్యాంగాన్ని హత్య చేయడంతోపాటు న్యాయ విభాగాన్ని బానిసగా మార్చుకోవాలనుకున్నారని ప్రధాని మోదీ విమర్శించారు..నాడు జార్జిఫెర్నాండెజ్ను సంకెళ్లతో బంధించారన్నారు.. దేశంలోని ప్రజలు విజ్ఞ్నలు కావడంతో ఎమర్జెన్సీ తొలగిపోయిందని చెప్పారు.. ఎమర్జెన్సీ విధించినవారు ప్రజాస్వామ్యం ముందు ఓడిపోయారని గుర్తుచేశారు..మొరార్జీ దేశాయ్,,వాజ్పేయి,,బాబూ జగ్జీవన్ రామ్ లాంటి నేతల ప్రసంగాలను మోదీ వినిపించారు.. ఎమర్జెన్సీపై పోరాడిన వారిని నేటి యువతరం ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలన్నారు..
ఆంధ్రప్రదేశ్లోని పల్నాడు:- జిల్లాలో బౌద్ధ క్షేత్రాలకు విదేశాల్లో అత్యంత ప్రాధాన్యం ఉందని చెప్పారు..అందరూ తమతమ ప్రాంతాల్లోని బౌద్ధ క్షేత్రాలను ఒక్కసారైనా సందర్శించాలని సూచించారు..అదేవిధంగా అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో ఉన్న శుభాంశు శుక్లాకు ప్రధాని అభినందనలు తెలిపారు.