సోమవారం పాఠశాలలకు, జానియర్ కళాశాలకు సెలవు-కలెక్టర్
నెల్లూరు: బంగాళాఖాతంలో ఏర్పడుతున్న ‘మోంతా’ తుఫాను నేపథ్యంలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున 27వ తేదిన (సోమవారం) అన్ని ప్రభుత్వ, ప్రైవేట్, ఎయిడెడ్ పాఠశాలలు, అంగన్వాడీ పాఠశాలలకు, అలాగే అన్ని ప్రభుత్వ, ప్రైవేట్, జానియర్ కళాశాలకు సెలవు ప్రకటించినట్లు జిల్లా కలెక్టర్ హిమాన్షు శుక్లా ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ ఉత్తర్వులను అన్ని రకాల పాఠశాలలు, జానియర్ కళాశాలల యాజమాన్యాలు విధిగా అమలుచేయాలని కలెక్టర్ ఆదేశించారు.

