DISTRICTS

ఈ నెల 10న జిల్లాకు రానున్న ముఖ్యమంత్రి చంద్రబాబు

నెల్లూరు: ఈ నెల 10 వ తేదిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు జిల్లా పర్యటనకు వచ్చే అవకాశం ఉన్నందున, వారి పర్యటన ను విజయవంతం చేయవలసినదిగా జిల్లా కలెక్టర్ హిమాన్షు శుక్లా అధికారులను ఆదేశించారు. వెంకటాచలం మండలం లోని ఈదగాలి గ్రామంలోని విస్వసముద్ర బయో ఇధనాల్ ప్లాంట్ ప్రారంభోత్సవానికి ముఖ్యమంత్రి రానున్న దృష్ట్యా,  ఏర్పాట్లను జిల్లా కలెక్టర్ హిమాన్షు శుక్లా జిల్లా ఎస్పీతో కలసి బుధవారం పరిశీలించారు.

ఈ సందర్బంగా ఈదురు బిట్ 2 గ్రామం లో ఏర్పాటు చేసిన హెలిప్యాడ్ ప్రాంతాన్ని, అక్కడి నుండి నంద గోకులం లైఫ్ స్కూల్, గోశాల, విస్వసముద్ర బయో ఇధనాల్ ప్లాంట్ ప్రాంతాలను పరిశీలించారు. కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లను చేయవలసిందిగా పోలీస్ అధికారులకు సూచించారు. ఈ కార్యక్రమంలో ఆర్డీఓ అనూష, డిటిసి చందర్, ఆర్ అండ్ బి, విద్యుత్ ఎస్ ఈలు గంగాధర్, రాఘవేందర్, తదితర వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *