రేణిగుంట విమానాశ్రయంలో లోక్ సభ స్పీకర్ ఓం బిర్లా కు ఘన స్వాగతం
తిరుపతి: జాతీయ మహిళా సాధికారత సదస్సుకు హాజరు అయ్యేందుకు శనివారం సాయంత్రం రేణిగుంట విమానాశ్రయానికి చేరుకున్న లోక్ సభ స్పీకర్ ఓం బిర్లాకి ఘన స్వాగతం పలికిన ఆంధ్రప్రదేశ్ శాసనసభ స్పీకర్ అయ్యన్నపాత్రుడు, డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజులు ఘన స్వాగతం పలికారు. అలాగే జిల్లా కలెక్టర్ డా.ఎస్ వెంకటేశ్వర్, చిత్తూరు ఎస్పీ మణికంఠ చందోలు, శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి, చిత్తూరు ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్, తిరుపతి, వరంగల్ పార్లమెంటు సభ్యులు ఎం. గురుమూర్తి, కడియం కావ్య, టీటీడీ బోర్డు మెంబర్ భాను ప్రకాష్ రెడ్డి, డిప్యూటీ మేయర్ ఆర్ సి మునికృష్ణ, శ్రీకాళహస్తి ఆర్డిఓ భాను ప్రకాష్ రెడ్డి, లైజన్ అధికారులు డ్వామా పిడి శ్రీనివాస ప్రసాద్, ప్రజాప్రతినిధులు తదితర అధికారులు లోక్ సభ స్పీకర్ కి స్వాగతం పలికిన వారిలో ఉన్నారు.