హైదరాబాద్లో భారీ డ్రగ్స్ ఫ్యాక్టరీ గుట్టురట్టు-రూ 12.000 కోట్ల విలువ చేసే మెఫెడ్రోన్ సీజ్
ముంబై పోలీసుల ఆపరేషన్…
హైదరాబాద్ శివార్ల లోని చర్లపల్లి పారిశ్రామిక ప్రాంతం కేంద్రంగా నడుస్తున్న అతి పెద్ద డ్రగ్స్ రాకెట్ను ముంబై పోలీసులు ఛేదించారు..ఒక కెమికల్ ఫ్యాక్టరీ ముసుగులో మాదక ద్రవ్యాలు తయారు చేస్తున్న ఈ ముఠా గుట్టును రట్టు చేసి, సుమారు రూ.12,000 కోట్ల విలువైన MD (మెఫెడ్రోన్) డ్రగ్ను, ముడి రసాయనాలను స్వాధీనం చేసుకున్నారు..
వివరాలు ఇలా వున్నాయి:- మహారాష్ట్రకు చెందిన మీరా-భయందర్, వసాయి-విరార్ పోలీసులు,,క్రైమ్ బ్రాంచ్ సంయుక్తంగా కొన్నాళ్లుగా ఓ డ్రగ్స్ ముఠాపై నిఘా పెట్టారు.. ఈ నేపధ్యంలో తమ గూఢచారులను రంగం లోకి దించి వారాల పాటు రహస్య ఆపరేషన్ నిర్వహించారు.. ముఠా మూలాలు హైదరాబాద్ లోని చర్లపల్లిలో ఉన్నట్లు పక్కా సమాచారం అందుకున్న పోలీసులు, స్థానిక ఫ్యాక్టరీపై మెరుపు దాడి చేశారు..
బంగ్లాదేశ్ మహిళ:- వాఘ్దేవి ల్యాబ్స్’ అనే నకిలీ లైసెన్స్ తో ఈ ఫ్యాక్టరీలో అత్యాధునిక పరికరాలతో భారీ ఎత్తున డ్రగ్స్ తయారు చేస్తున్నట్లు గుర్తించారు..ఈ దాడిలో ఫ్యాక్టరీ యజమాని, రసాయన నిపుణుడైన శ్రీనివాస్తో పాటు అతని సహచరుడు తానాజీ పాఠే,,అలాగే మరో 11 మందిని అరెస్ట్ చేశారు.. వీరిలో గత నెలలో మహారాష్ట్రలోని మీరా రోడ్లో రూ.24 లక్షల విలువైన మాదకద్రవ్యాలతో పట్టుబడిన బంగ్లాదేశ్ మహిళ కూడా ఉంది. ఆమెను ఫాతిమా మురాద్ షేక్ అలియాస్ మొల్లా (23)గా గుర్తించారు.
35,000 వేల లీటర్ల కెమికల్:-నిందితుల నుంచి ప్రాథమికంగా 100 గ్రాముల ఎండీ డ్రగ్, రూ.25 లక్షల నగదును స్వాధీనం చేసుకున్నారు. ఫ్యాక్టరీలో జరిపిన సోదాలలో డ్రగ్స్ తయారీకి వినియోగించే సుమారు 35,000 వేల లీటర్ల రసాయనాలతో పాటు, భారీ ఉత్పత్తి యూనిట్లను కూడా సీజ్ చేశారు.ఈ ఫ్యాక్టరీ నుంచి తయారైన మాదక ద్రవ్యాలను మహారాష్ట్రతో పాటు అనేక ఇతర రాష్ట్రాలకు సరఫరా చేస్తున్నట్లు పోలీసుల దర్యాప్తులో తేలింది.ఇంత పెద్ద నెట్వర్క్ హైదరాబాద్ కేంద్రంగా పని చేస్తుండటం తీవ్ర కలకలం రేపుతోంది. ఈ కేసులో ఇంకా ఎవరెవరికి సంబంధాలున్నాయనే కోణంలో పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు.