విజయవాడ,విశాఖ మెట్రో రైల్ ప్రాజెక్ట్ లకు రుణాలు ఇచ్చేందుకు ఆసక్తి చూపుతున్న విదేశీ బ్యాంకులు
అమరావతి: విజయవాడ,విశాఖ మెట్రో రైల్ ప్రాజెక్ట్ లకు రుణాలు ఇచ్చేందుకు ఆసక్తి చూపిస్తున్న (KFW,AFD, ADB,NDB, AIIB) విదేశీ బ్యాంకులు..జైకా,,ప్రపంచ బ్యాంకు ప్రతినిధులు, విజయవాడలో ప్రతిపాదిత మెట్రో కారిడార్ లను క్షేత్రస్థాయిలో పరిశీలించారు..రెండు మెట్రో ప్రాజెక్ట్ లకు అయ్యే వ్యయంలో 12000 కోట్లు రుణం అవసరం అవుతుందని అంచనాలు వున్నాయి.. విశాఖ మెట్రోకు 6100 కోట్లు,,విజయవాడ మెట్రోకు 5900 కోట్లు రుణం సమీకరించాలని ప్రభుత్వం నిర్ణయించింది.. తక్కువ వడ్డీకి లోన్ ఇచ్చే బ్యాంకులతో మెట్రో కార్పొరేషన్ ఎండీ రామకృష్టారెడ్డి సంప్రదింపులు జరుపుతున్నారు..ఈ విషయమై త్వరలో కేంద్ర,,రాష్ట్ర ప్రభుత్వాలతో విదేశీ బ్యాంకుల ప్రతినిధులు చర్చలు జరపనున్నారు.. రెండు నగరాల్లో మెట్రో ప్రాజెక్ట్ ఏర్పాటుకు వేగంగా ఏపీ మెట్రో రైల్ కార్పొరేషన్ లిమిటెడ్ ముందుకు వెళుతొంది..దశల వారీగా ఈప్రాజెక్టులను చేపట్టనున్నారు.