గోదావరి నదిలో 8 మంది యువకులు గల్లంతు
అమరావతి: కోనసీమ జిల్లా ముమ్మిడివరం మండలం కమినిలంక వద్ద గోదావరిలో 8 మంది యువకులు గల్లంతయ్యారు. కె.గంగవరం మండలం శురుల్లంకలో శుభకార్యానికి వెళ్లిన యువకుల్లో 11 మంది స్నానం కోసం గోదావరి నదిలో దిగారు. లోతైన ప్రాంతం కావడంతో 8 మంది గల్లంతుకాగా, ముగ్గురు సురక్షితంగా బయటకు వచ్చారు. గల్లంతైన వారిని కాకినాడ, రామచంద్రపురం, మండపేటకు చెందిన క్రాంతి, పాల్, సాయి, సతీష్, మహేశ్, రాజేశ్, రోహిత్, మహేశ్గా గుర్తించారు. గల్లంతైన యువకుల కోసం పోలీసులు, స్థానికులు గాలింపు చర్యలు చేపట్టారు.

