NATIONAL

రైలు ఆధారిత మొబైల్‌ లాంఛర్‌ నుంచి ‘అగ్ని ‌ప్రైమ్’ క్షిపణి పరీక్ష విజయవంతం

అమరావతి: భారతదేశం తన రక్షణ సామర్ద్యంను ఎలాంటి చడిచప్పుడు లేకుండా పెంచుకుంటు పోతుంది..అగ్ని లాంటి అతిశక్తివంతంమైన క్షిపణిని నేలపై నుంచే కాకుండా మొబైల్ లాంచర్స్ నుంచి కూడా ప్రయోగించే పరిక్షను డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ ఆర్గనైజేషన్ (DRDO) విజయవంతంగా పూర్తి చేసింది..శత్రుదేశామైన పాకిస్తాన్,,చైనాలతో భవిష్యత్ లో యుద్దం చేయాల్సి పరిస్థితి ఏర్పడితే,,అతి తక్కవ సమయంలో శత్రుదేశాల శాటిలైట్స్ కు దొరకకుండా మొబైల్ లాంచర్స్ నుంచి ‘అగ్ని ‌ప్రైమ్’ క్షిపణి ప్రయోగం శత్రుదేశాలపై పై చెయ్యి సాధించేందుకు ఎంతగానో వుపయోపడుతుంది..

2,000 కిలోమీటర్ల పరిధిలో:- బుధవారం అర్ధరాత్ర ఒడిశా రాష్ట్రంలోని బాలాసోర్‌ ఇంటిగ్రేటెడ్ టెస్ట్ రేంజ్‌లో నిర్వహించిన ‘అగ్ని ‌ప్రైమ్’ క్షిపణి పరీక్ష విజయవంతమైందని రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ గురువారం ఉదయం ప్రకటించారు..2,000 కిలోమీటర్ల పరిధిలోని లక్ష్యాలను చేధించే లక్ష్యంతో రూపొందించిన ఈ ప్రయోగాన్ని రైలు ఆధారిత మొబైల్‌ లాంఛర్‌ వ్యవస్థ నుంచి విజయవంతంగా పరీక్షించినట్లు రాజ్‌నాథ్‌ సింగ్‌ వెల్లడించారు.. ఈ విజయాన్ని భారత రక్షణ రంగంలో ఓ మైలురాయిగా అభివర్ణిస్తూ,, DRDO శాస్త్రవేత్తలకు అభినందనలు తెలిపారు.. అణు సామర్థ్యం కలిగిన అగ్ని ప్రైమ్‌ క్షిపణికి 1,000 నుంచి 2,000 కిలోమీటర్ల దూరంలోని లక్ష్యాలను ధ్వంసం చేసే సత్తా ఉందని సంబంధి వర్గాలు ప్రకటిస్తున్నప్పటికి ‘అగ్ని ‌ప్రైమ్’ క్షిపణి దాదాపు 3000 కీ.మీపైనే వుంటుందని ఒక అంచనా.

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *