AP&TGDISTRICTS

శనివారం భారీ వర్షాలు కురిసే అవకాశం-ప్రఖర్ జైన్

అమరావతి: దక్షిణ కోస్తాంధ్ర నుంచి ఉత్తర శ్రీలంక వరకు తమిళనాడు తీరం మీదుగా ద్రోణి కొనసాగుతోందని విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ ప్రఖర్ జైన్ తెలిపారు..బుధవారం(13 ఆగస్టు) నాటికి వాయువ్య,,దానిని ఆనుకుని ఉన్న పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడేందుకు అవకాశం ఉందన్నారు..శనివారం (09-08-25) ప్రకాశం, నెల్లూరు,కర్నూలు, నంద్యాల,చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో కొన్నిచోట్ల పిడుగులతో కూడిన మోస్తారు నుంచి భారీ వర్షాలు, మిగతా జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *