BUSINESSNATIONALOTHERS

ఇన్ఫోసిస్ నారాయణ మూర్తి మనవడు 17 నెలల ఏకాగ్ర రోహన్ మూర్తి రూ.3.3 కోట్ల డివిడెండ్

అమరావతి: ఇన్ఫోసిస్ సహ వ్యవస్థాపకుడు నారాయణ మూర్తి మనవడు 17 నెలల ఏకాగ్ర రోహన్ మూర్తి, మార్చి 2025తో ముగిసే ఆర్థిక సంవత్సరానికి కంపెనీ తుది డివిడెండ్ నుంచి రూ.3.3 కోట్లు అందుకోనున్నారు..దింతో రోహన్ భారతదేశంలోని అతి పిన్న వయస్కుడైన మిలియనీర్లలో ఒకరిగా నిలిచాడు.దేశంలోని అగ్రగామని ఐటీ సంస్థల్లో ఒకటైన ఇన్ఫోసిస్‌ 2025 మార్చితో ముగిసిన ఆర్థిక సంవత్సరానికి తుది డివిడెండ్‌ను ప్రకటించింది.. ఒక్కో షేరుకు రూ.22 చెల్లించేందుకు బోర్డు ఆమోదం తెలిపింది..తద్వారా నారాయణమూర్తి మనవడు ఏకాగ్రహ్‌ రోహన్‌ మూర్తి ఇన్ఫీ నుంచి రూ.3.3 కోట్లు అందుకోనున్నాడు. ఏకాగ్రహ్‌ నవంబర్‌ 2023లో నారాయణమూర్తి-సుధామూర్తి దంపతుల కుమారుడు రోహన్‌మూర్తి, అపర్ణామూర్తికి జన్మించాడు. నారాయణమూర్తి-సుధామూర్తి దంపతులకు ఆయన మూడో మనవడు.

ఏకాగ్రహ్‌ రోహన్‌మూర్తి నాలుగు నెలల వయసు ఉన్నప్పుడే రూ.240 కోట్ల (అప్పటి విలువ) విలువైన షేర్లను నారాయణమూర్తి బహుమతిగా రాసిచ్చారు..రోహన్ మూర్తికి 15లక్షల ఇన్ఫోసిస్ షేర్లను గిఫ్ట్‌గా ఇచ్చారు.. ఇది కంపెనీలో మొత్తం విలువలో షేర్లు 0.04శాతం..తాతా ఇచ్చిన బహుమతితో యంగ్‌ మిలియనీర్‌గా మారాడు..ఏకాగ్రహ్‌ రోహన్‌మూర్తికి 2024 మార్చిలో రూ.7.35 కోట్ల డివిడెండ్‌ అందుకున్నాడు..ఈ ఏడాది రూ.3.3 కోట్లు అందుకోబోతున్నాడు.. దీంతో ఇప్పటి వరకూ ఈ షేర్ల ద్వారా డివిడెండ్‌ రూపంలో ఈ చిన్నారి మొత్తం రూ.10.65 కోట్లు సంపాదించాడు.

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *