BUSINESSNATIONALOTHERS

నావికుల సంఖ్యలో ప్రపంచంలోని తొలి మూడు దేశాల్లో భారత్‌ ఒకటిగా నిలిచింది-ప్రధాని మోదీ

అమరావతి: కొంత కాలం క్రిందట వరకు భారతదేశం 75 శాతం షిప్‌మెంట్ కార్యకలాపాలు విదేశీ ఓడరేవులలో నిర్వహించడం వల్ల దేశం చాలా ఆదాయాన్ని నష్టపోయిందని,,గత 10 సంవత్సరాల కాలంలో దేశీయంగా పోర్టుల సామర్ద్యం రెట్టింపు అయిందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తెలిపారు.. శనివారం కేరళలో తిరువనంతపురంలో రూ. 8,867 కోట్లతో నిర్మించిన విజింజం అంతర్జాతీయ ఓడరేవును CM పినరయి విజయన్, కాంగ్రెస్‌ ఎంపీ శశిథరూర్‌, పారిశ్రామికవేత్త గౌతమ్‌ అదానీ సమక్షంలో మోదీ ప్రారంభించారు..ఈ సందర్భంగా ప్రధాని మోదీ మాట్లాడుతూ నావికుల సంఖ్యలో ప్రపంచంలోని తొలి మూడు దేశాల్లో భారత్‌ ఒకటిగా నిలిచిందని,, టర్నరౌండ్ సమయం 30 శాతం తగ్గిందని తెలిపారు.. విజిన్‌జం అంతర్జాతీయ సీపోర్ట్ భారతదేశంలోని అత్యంత ప్రతిష్టాత్మక ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్టుల్లో ఒకటి..ఈ సీపోర్ట్ అదానీ పోర్ట్స్ అండ్ SEZ లిమిటెడ్ ఆధ్వర్యంలో పబ్లిక్-ప్రైవేట్ భాగస్వామ్యంతో అభివృద్ధి చేశారు.. అంతర్జాతీయ సముద్ర వాణిజ్యంలో కీలక ట్రాన్స్‌ షిప్‌మెంట్ హబ్‌గా ఈ సీపోర్ట్ నిర్మితమైంది.

రాజకీయాలపై కీలక వ్యాఖ్యలు:- ఈ కార్యక్రమంలో శశి థరూర్ ఉన్నారని, ఇది కొందరి నిద్రను భంగం చేస్తుందని,,కాంగ్రెస్ పార్టీ అగ్రనాయకత్వంను ఉద్దేశించి వ్యంగ్యంగా వ్యాఖ్యనించారు.. తిరువనంతపురం నుంచి 4 సార్లు ఎంపీగా గెలిచిన శశి థరూర్‌ గురించి ప్రధాని నేరుగా ప్రస్తావించడంతో, శశి థరూర్‌ బీజేపీలో చేరుతారా అనే చర్చ రాజకీయ వర్గాల్లో మొదలైంది.

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *