పశ్చిమ బెంగాల్ మాజీ ముఖ్యమంత్రి బుద్దదేవ్ భట్టాచార్య కన్నుమూత
అమరావతి: పశ్చిమ బెంగాల్ మాజీ ముఖ్యమంత్రి,కమ్యూనిస్ట్ పార్టీ కురువృద్దుడు బుద్దదేవ్ భట్టాచార్య(80) కోల్కతాలోని పామ్ అవెన్యూలో గురువారం ఉదయం 8.30 నిమిషాలకు కన్నుమూశారు.. 2000 నుంచి 2011 వరకు ఆయన బెంగాల్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు నిర్వర్తించారు.. తండ్రి బుద్దదేవ్ మరణించినట్లు కుమారుడు సుచేతన్ భట్టాచార్య ప్రకటించారు.. బెంగాల్కు 6వ సీఎంగా బాధ్యతలు నిర్వహించారు..బెంగాల్లో సుమారు 34 ఏళ్లు వామపక్ష పార్టీలు ప్రభుత్వ పాలను నిర్వహించాయి..ఇందులో చివరి సీఎంగా బుద్దదేవ్ విధులు చేపట్టారు..గత కొంత కాలంగా ఆయన శ్వాసకోస వ్యాధితో ఆయన బాధపడుతున్నారు..పలుమార్లు ఆస్పత్రిలో చికిత్స చేయించుకున్నారు. ఇటీవల నుమోనియా సోకడంతో ఆయన లైఫ్ సపోర్టుపై ఉన్నారు.