AP&TG

శుక్రవారం పిడుగులతో కూడిన మోస్తారు నుంచి భారీ వర్షాలు-APSDMA

అమరావతి: కర్ణాటక నుండి దక్షిణ బంగాళాఖాతం మధ్యప్రాంతాల వరకు దక్షిణ ఇంటీరియర్ కర్ణాటక, దక్షిణ రాయలసీమ, ఉత్తర తమిళనాడు మీదుగా ద్రోణి విస్తరించి ఉందని (APSDMA) ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ పేర్కొంది. దీని ప్రభావంతో శుక్రవారం రాయలసీమలో పిడుగులతో కూడిన మోస్తారు నుంచి భారీ వర్షాలు, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు,పల్నాడు, ప్రకాశం,నెల్లూరు జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించింది. పిడుగుపాటు పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించింది.

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *