కాకాణి గోవర్ధన్ రెడ్డికి ముందస్తు బెయిల్ను నిరాకరించిన సుప్రీంకోర్టు
అమరావతి: వైసీపీ మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డికి సుప్రీం కోర్టు,ముందస్తు బెయిల్ను నిరాకరించింది.. క్వార్ట్జ్ అక్రమాలు,,భారీ ఎత్తున పేలుడు పదార్ధాల వినియోగం,,అట్రాసిటీ కేసులో కాకాణి A1గా ఉన్నాడు..కేసులకు సంబంధించి విచారణకు హాజరు కావాలని నెల్లూరు డీఎస్పీ ఘట్టమనేని శ్రీనివాసులు నోటీసులు ఇచ్చినా కాకాణి జాడలేదు.. దాదాపు రెండు నెలలుగా పోలీసులకు దొరక్కుండా తప్పించుకు తిరుగుతున్నారు..ఈ కేసుకు సంబంధించి గతంలోనూ ఏపీ హైకోర్టులో ముందస్తు బెయిల్ కోసం కాకాణి పిటిషన్ దాఖలు చేయగా, అక్కడ కూడా నిరాశే ఎదురైంది..కాకాణికి ముందస్తు బెయిల్ ఇచ్చేందుకు హైకోర్టు నిరాకరించింది..దీంతో సుప్రీం కోర్టులో ముందస్తు బెయిల్ కోసం పిటిషన్ వేయగా,, శుక్రవారం విచారణకు వచ్చింది.. కాకాణి తరఫున ప్రముఖ న్యాయవాది,,మాజీ హైకోర్టు న్యాయమూర్తి దామా శేషాద్రినాయుడు,,అభినవ్ వాదనలు వినిపించారు..అయితే సుప్రీం కోర్టు కాకాణి ముందస్తు బెయిల్ ఇచ్చేందుకు నిరాకరిస్తూ,, పిటిషన్ను డిస్మిస్ చేసింది.. విత్ డ్రా చేసుకోవడానికి అనుమతి ఇవ్వాలని కాకాణి తరుపు న్యాయవాదులు బ్రతిమిలాడినప్పటికీ సుప్రీం ధర్మాసనం అంగీరించలేదు.ఇక తప్పదేమో?

